Don't Miss!
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Lifestyle తీర్చుకోలేని రుణం అమ్మ ప్రేమ..! మన పుట్టినరోజున అందరికంటే ఎక్కువ సంతోషపడేది అమ్మ..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హేమామాలినికి నెటిజన్ల ఝలక్.. ధీటుగా జవాబిచ్చిన డ్రీమ్ గర్ల్
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని గుప్పిట పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. మానవ జీవితంలోకి కరోనా రావడంతో జీవిన శైలి పూర్తిగా మారింది. ఒకరికి ఒకరు అంటకుండా సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. చేతులను శుభ్రంగా కడుక్కుంటున్నారు. విధిగా మాస్కులు ధరిస్తున్నారు. ఇన్నాళ్లు పాటించని ఆరోగ్య సూత్రాలను పాటిస్తున్నారు. అయితే మానవాళి మార్పులకు అనుగుణంగా తమ ఉత్పత్తులను, వాటికి సంబంధించిన ప్రకటనలను (యాడ్స్)కూడా విభిన్న పద్దతుల్లో చేస్తున్నారు. ఆ మధ్య బంటీ నీ సబ్బు స్లోనా యేంటి? అన్నవారే.. ఇప్పుడు దాదాపుగా ఇరవై సెకన్ల పాటు చేతులను శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు.
ఈ క్రమంలో ఓ కంపెనీ అత్యుత్సాహం ప్రదర్శించి.. నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. ఈ మేరకు కెంట్ అనే సంస్థ విడుదల చేసిన తాజా యాడ్ వైరల్ అయింది. ఇందులో చపాతీ చేసుకుని మిషన్ గురించి చెబుతూ.. మీ పని మనిషి చేతులకు క్రిములు ఉండొచ్చు అంటూ పని మనిషి అవసరం లేకుండా చపాతి, బ్రెడ్ మేకింగ్ మిషన్పై క్రియేట్ చేసిన యాడ్ విమర్శలు ఎదుర్కొంటోంది. కెంట్ వాటర్ ఫ్యూరిఫైయర్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న నాటి హీరోయిన్ హేమమాలినికి ఈ సెగ తగిలింది.
హేమ మాలిని విమర్శిస్తూ.. నెటిజన్స్ అందరూ కామెంట్స్ చేయసాగారు. వీటన్నంటికి కలిసి హేమమాలిని ఓ ట్వీట్ చేసింది. దాని సారాంశం ఏంటో ఓ సారి చూద్దాం. కెంట్ అట్టా తాజాగా రిలీజ్ చేసిన యాడ్కు తనకూ ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చింది. అందులో వెలిబుచ్చిన అభిప్రాయాలు తనను ప్రతిబింబించవని, తనకు చెందినవి కావని క్లారిటీ ఇచ్చింది. కెంట్ చైర్మన్ ఇప్పటికే ఆ యాడ్పై అందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పారని పేర్కొంది. సమాజంలోని ప్రతీ వర్గం పట్ల తనకు తగినంత గౌరవం ఉందని చెప్పడానికి ఈ ట్వీట్ చేశానని తెలిపింది.