Don't Miss!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సెట్లో హీరోయిన్పై గూండాల దాడి... షూటింగ్లో గొడ్డును బాదినట్టు.. పోలీసుల అండతో
పద్మావత్ సినిమా షూటింగ్లో దాడి ఘటన తర్వాత మరోసారి బాలీవుడ్ హీరోయిన్ మహీ గిల్పై సెట్లో అగంతకులు దాడి చేశారు. ఫిక్సర్ అనే వెబ్ సిరీస్ షూటింగ్ సందర్బంగా జరిగిన ఘటనలో సినిమాటోగ్రాఫర్, దర్శకుడికి తీవ్ర గాయాలయ్యాయి. నలుగురు గుండాలతోపాటు పోలీసులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారని నిర్మాత సాకేత్ సావ్నీ వెల్లడించారు. నిర్మాత మాట్లాడిన వీడియోను ఏక్తాకపూర్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో జరిగింది. ఈ దాడి ఘటనలోకి వెళితే..
ఏక్తాకపూర్ వీడియో షేర్ చేయగా
ఏక్తాకపూర్ షేర్ చేసి వీడియోలో నిర్మాత సాకేత్ సావ్నీ మాట్లాడుతూ.. పోర్ బందర్కు సమీపంలో మేము షూటింగ్ చేస్తున్నాం. అన్ని అనుమతులు ఉన్నాయి. వాటికి సంబంధించిన డబ్బు కూడా చెల్లించాం. నలుగురు వ్యక్తులు సెట్లోకి ప్రవేశించి హీరోయిన్ మహీ గిల్పై దాడి చేశారు. ఆమె సామాగ్రిని చిందర వందర చేసి పడేశారు. సినిమాటోగ్రాఫర్ సంతోష్ తుండ్యాల్పై దాడి చేయగా తలకు గాయమైంది. దాంతో చికిత్స చేసి బ్యాండేజ్ వేశాం. దర్శకుడి భుజానికి తీవ్రగాయమైంది అని తెలిపారు.
పోలీసుల సహకారంతోనే గూండాలు
తమపై అగంతకులతోపాటు పోలీసుల కూడా దాడి చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయడానికి కూడా అవకాశం లేకపోయింది. పోలీసులే దాడి చేసినప్పుడు ఎవరి ఫిర్యాదు చేయాలి అని నిర్మాత సాకేత్ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాటోగ్రాఫర్ తలకు బలమైన గాయం కావడంతో కుట్లు వేశారు. దర్శకుడు భుజం డిస్ లొకేట్ అయ్యింది అని యూనిట్ తెలిపింది.
ఎవరు దొరికితే వాళ్లపై దాడి
మేము ఓ ఫ్యాక్టరీలో షూట్ చేస్తున్నాం. ఉదయం 7 గంటల నుంచి షూటింగ్ ప్రారంభమైంది. 4.30 గంటల సమయంలో సెట్లోకి నలుగురు దురుసుగా వచ్చారు. వాళ్ల చేతిలో కర్రలు, రాడ్స్ ఉన్నాయి. తప్పతాగి ఉండటంతో యూనిట్ సభ్యులు ఎవరు దొరికితే వాళ్లపై దాడి చేశారు. దాడి తర్వాత పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. కేసు పెట్టడం కోర్టులో తేల్చుకొందామని అన్నారని నిర్మాత తెలిపారు.
మహీ గిల్ కన్నీరు మున్నీరుగా
అగంతకుల దాడి ఘటన తర్వాత మహీ గిల్ కన్నీరుమున్నీరయ్యారు. సెట్లో ఉండగా హఠాత్తుగా నాపైకి వచ్చారు. కారణం తెలియజేయకుండా నన్ను కొట్టారు. వెంటనే భయంతో వ్యానిటీ వ్యాన్లోకి పరుగెత్తి తలదాచుకొన్నాను. మా యూనిట్ సభ్యులను గొడ్డును బాదినట్టు బాదారు. అగంతకులను కొట్టమని పోలీసులు ప్రోత్సహించారు. దాంతో పోలీసులకు మేము ఫిర్యాదు చేయలేదు అని హీరోయిన్ మహీ గిల్ చెప్పారు. మహీ గిల్ సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సిరీస్ అన్నింట్లో నటించిన సంగతి తెలిసిందే.
పద్మావత్ సినిమా షూటింగ్లో కూడా
బాలీవుడ్లో సెట్లోకి వచ్చి దాడి చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తున్న పద్మావత్ సినిమా సెట్లో ఇలాంటి దాడే జరిగింది. దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్, షాహీద్ కపూర్ సెట్లో ఉండగానే మూడుసార్లు ఆయనపై దాడి చేశారు. ఆ తర్వాత సినిమాను పూర్తి చేయడానికి పోలీసుల సహకారం తీసుకొన్నారు.