Don't Miss!
- News అచ్చెన్నాయుడు ప్రత్యర్ధికి ఊరట-పోటీ నుంచి తప్పుకున్న భార్య..!
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
- Finance Amit Shah: ఆ కంపెనీల్లో అమిత్ షా పెట్టుబడులు.. హోం మంత్రి పోర్ట్ఫోలియోలో టాప్-10 స్టాక్స్ ఇవే
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
సెట్లో హీరోయిన్పై గూండాల దాడి... షూటింగ్లో గొడ్డును బాదినట్టు.. పోలీసుల అండతో
పద్మావత్ సినిమా షూటింగ్లో దాడి ఘటన తర్వాత మరోసారి బాలీవుడ్ హీరోయిన్ మహీ గిల్పై సెట్లో అగంతకులు దాడి చేశారు. ఫిక్సర్ అనే వెబ్ సిరీస్ షూటింగ్ సందర్బంగా జరిగిన ఘటనలో సినిమాటోగ్రాఫర్, దర్శకుడికి తీవ్ర గాయాలయ్యాయి. నలుగురు గుండాలతోపాటు పోలీసులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారని నిర్మాత సాకేత్ సావ్నీ వెల్లడించారు. నిర్మాత మాట్లాడిన వీడియోను ఏక్తాకపూర్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో జరిగింది. ఈ దాడి ఘటనలోకి వెళితే..
ఏక్తాకపూర్ వీడియో షేర్ చేయగా
ఏక్తాకపూర్ షేర్ చేసి వీడియోలో నిర్మాత సాకేత్ సావ్నీ మాట్లాడుతూ.. పోర్ బందర్కు సమీపంలో మేము షూటింగ్ చేస్తున్నాం. అన్ని అనుమతులు ఉన్నాయి. వాటికి సంబంధించిన డబ్బు కూడా చెల్లించాం. నలుగురు వ్యక్తులు సెట్లోకి ప్రవేశించి హీరోయిన్ మహీ గిల్పై దాడి చేశారు. ఆమె సామాగ్రిని చిందర వందర చేసి పడేశారు. సినిమాటోగ్రాఫర్ సంతోష్ తుండ్యాల్పై దాడి చేయగా తలకు గాయమైంది. దాంతో చికిత్స చేసి బ్యాండేజ్ వేశాం. దర్శకుడి భుజానికి తీవ్రగాయమైంది అని తెలిపారు.
పోలీసుల సహకారంతోనే గూండాలు
తమపై అగంతకులతోపాటు పోలీసుల కూడా దాడి చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయడానికి కూడా అవకాశం లేకపోయింది. పోలీసులే దాడి చేసినప్పుడు ఎవరి ఫిర్యాదు చేయాలి అని నిర్మాత సాకేత్ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాటోగ్రాఫర్ తలకు బలమైన గాయం కావడంతో కుట్లు వేశారు. దర్శకుడు భుజం డిస్ లొకేట్ అయ్యింది అని యూనిట్ తెలిపింది.
ఎవరు దొరికితే వాళ్లపై దాడి
మేము ఓ ఫ్యాక్టరీలో షూట్ చేస్తున్నాం. ఉదయం 7 గంటల నుంచి షూటింగ్ ప్రారంభమైంది. 4.30 గంటల సమయంలో సెట్లోకి నలుగురు దురుసుగా వచ్చారు. వాళ్ల చేతిలో కర్రలు, రాడ్స్ ఉన్నాయి. తప్పతాగి ఉండటంతో యూనిట్ సభ్యులు ఎవరు దొరికితే వాళ్లపై దాడి చేశారు. దాడి తర్వాత పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. కేసు పెట్టడం కోర్టులో తేల్చుకొందామని అన్నారని నిర్మాత తెలిపారు.
మహీ గిల్ కన్నీరు మున్నీరుగా
అగంతకుల దాడి ఘటన తర్వాత మహీ గిల్ కన్నీరుమున్నీరయ్యారు. సెట్లో ఉండగా హఠాత్తుగా నాపైకి వచ్చారు. కారణం తెలియజేయకుండా నన్ను కొట్టారు. వెంటనే భయంతో వ్యానిటీ వ్యాన్లోకి పరుగెత్తి తలదాచుకొన్నాను. మా యూనిట్ సభ్యులను గొడ్డును బాదినట్టు బాదారు. అగంతకులను కొట్టమని పోలీసులు ప్రోత్సహించారు. దాంతో పోలీసులకు మేము ఫిర్యాదు చేయలేదు అని హీరోయిన్ మహీ గిల్ చెప్పారు. మహీ గిల్ సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సిరీస్ అన్నింట్లో నటించిన సంగతి తెలిసిందే.
పద్మావత్ సినిమా షూటింగ్లో కూడా
బాలీవుడ్లో సెట్లోకి వచ్చి దాడి చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తున్న పద్మావత్ సినిమా సెట్లో ఇలాంటి దాడే జరిగింది. దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్, షాహీద్ కపూర్ సెట్లో ఉండగానే మూడుసార్లు ఆయనపై దాడి చేశారు. ఆ తర్వాత సినిమాను పూర్తి చేయడానికి పోలీసుల సహకారం తీసుకొన్నారు.