Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అమీర్ ఖాన్ డ్రాప్... మరో హీరో చేతుల్లోకి విక్రమ్ వేద
కోలీవుడ్ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన విక్రమ్ వేదా రీమేక్స్ పై గత కొంతకాలంగా అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా ఆ సినిమాను రీమేక్ చేయడానికి పలువురు హీరోలు ఇంట్రెస్ట్ చూపించినట్లు టాక్ వచ్చింది. ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే ఆల్ మోస్ట్ ఫిక్స్ అయిన కాంబినేషన్ బ్రేక్ అయ్యింది.
అమీర్ ఖాన్ చేయాల్సినా పాత్ర కోసం మరొక హీరోను ఫిక్స్ చేశారు. మాధవన్, విజయ్ సేతుపతి కలిసి నటించిన తమిళ మూవీ విక్రమ్ వేదా. ఈ సినిమా 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే బాలీవుడ్ లో ఆ సినిమాలో నటించడానికి అందరికంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించింది మాత్రం అమీర్ ఖాన్. అయితే ఇప్పుడు అహీరోనే తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. మాధవన్ పాత్రను మరో హీరో చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు.
మాధవన్ చేసిన పాత్రలో హృతిక్ రోషన్ నటిస్తుండగా విజయ్ సేతుపతి చేసిన పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. అందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక తమిళ్ ఒరిజినల్ కథను డైరెక్ట్ చేసిన డైరెక్టర్ కపుల్స్ పుష్కర్ - గాయత్రి హిందీ సినిమాను కూడా భారీ స్థాయిలో తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. మరి బాలీవుడ్ లో విక్రమ్ వేదా ఎలాంటి సంచలనాలకు దారి తీస్తుందో చూడాలి.