Don't Miss!
- News పొలిటికల్ పంచ్, ఓటు కోసం మాట మార్చిన సీఎం, కాలేజ్ అమ్మాయి కేసు కోసం స్పెషల్ కోర్టు!
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అమీర్ ఖాన్ డ్రాప్... మరో హీరో చేతుల్లోకి విక్రమ్ వేద
కోలీవుడ్ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన విక్రమ్ వేదా రీమేక్స్ పై గత కొంతకాలంగా అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా ఆ సినిమాను రీమేక్ చేయడానికి పలువురు హీరోలు ఇంట్రెస్ట్ చూపించినట్లు టాక్ వచ్చింది. ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే ఆల్ మోస్ట్ ఫిక్స్ అయిన కాంబినేషన్ బ్రేక్ అయ్యింది.
అమీర్ ఖాన్ చేయాల్సినా పాత్ర కోసం మరొక హీరోను ఫిక్స్ చేశారు. మాధవన్, విజయ్ సేతుపతి కలిసి నటించిన తమిళ మూవీ విక్రమ్ వేదా. ఈ సినిమా 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే బాలీవుడ్ లో ఆ సినిమాలో నటించడానికి అందరికంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించింది మాత్రం అమీర్ ఖాన్. అయితే ఇప్పుడు అహీరోనే తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. మాధవన్ పాత్రను మరో హీరో చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు.
మాధవన్ చేసిన పాత్రలో హృతిక్ రోషన్ నటిస్తుండగా విజయ్ సేతుపతి చేసిన పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. అందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక తమిళ్ ఒరిజినల్ కథను డైరెక్ట్ చేసిన డైరెక్టర్ కపుల్స్ పుష్కర్ - గాయత్రి హిందీ సినిమాను కూడా భారీ స్థాయిలో తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. మరి బాలీవుడ్ లో విక్రమ్ వేదా ఎలాంటి సంచలనాలకు దారి తీస్తుందో చూడాలి.