Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అందుకే పెళ్లి చేసుకోవడం లేదు, అసలు కారణం చెప్పిన సల్మాన్ ఖాన్
ఇండియన్ సినిమా పరిశ్రమలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్లలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అందరికంటే ముందు ఉంటారు. అతడి పెళ్లికి సంబంధించి కొన్నేళ్లుగా మీడియాలో రకరకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆయన ఏ ఇంటర్వ్యూకు వెళ్లినా అక్కడ తప్పకుండా ఎదురయ్యే ప్రశ్న పెళ్లి గురించే. తాజాగా ఓ ఆంగ్లపత్రికతో ముఖాముఖిలో పాల్గొన్న సల్లూ భాయ్కు మరోసారి ఇదే ప్రశ్న ఎదురైంది. ఎట్టకేలకు సల్మాన్ ఖాన్ ఈ విషయమై స్పందించారు. తాను ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు? పెళ్లిపై తనకు ఉన్న అభిప్రాయాలు ఏమిటనేది వివరించారు.
అందుకే పెళ్లి చేసుకోవడం లేదన్న సల్మాన్ ఖాన్
నేను పెళ్లి అనే విషయాన్ని నమ్మను. పెళ్లి జరిగిందంటే మన పతనం మొదలైనట్లే అని భావిస్తాను. మ్యారేజ్ వల్ల నా జీవితం మరింత బాగుపడుతుందనే నమ్మకం అస్సలు లేదు. నా కంటూ సాహచర్యం కావాలని కూడా కోరుకోవడం లేదు. అందుకే వివాహానికి దూరంగా ఉంటున్నట్లు సల్మాన్ ఖాన్ తెలిపారు.
తండ్రి అవ్వాలని లేదా?
మీకంటూ వారసులు ఉండాలని లేదా? పిల్లను కనాలని లేదా? అనే ప్రశ్నకు సల్మాన్ ఖాన్ ఆసక్తికరంగా స్పందించారు. ‘అది జరుగాల్సిన సమయంలో జరుగుతుంది' అంటూ సమాధానం ఇచ్చారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ పెళ్లితో సంబంధం లేకుండా పిల్లలను కనాలని ఉందని చెప్పిన సంగతి తెలిసిందే.
ప్రియాంకతో ఎలాంటి వివాదం లేదు
‘భారత్' మూవీ విషయంలో ప్రియాంక చోప్రాతో ఎలాంటి వివాదం లేదని సల్మాన్ ఖాన్ స్పష్టం చేశారు. ఆమె తన వివాహం కారణంగానే ఈ చిత్రం నుంచి తప్పకుందని, ఈ మూవీలో నటించాలని ఆమె చాలా ఆసక్తిగా ఎదురు చూసింది, కానీ పరిస్థితులు అందుకు అనుకూలించలేదు. అయితే ఆమె స్థానాన్ని కత్రినా కైఫ్ పర్ఫెక్టుగా భర్తీ చేసిందని తెలిపారు.
భారత్
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్న 'భారత్' ఈద్ సందర్భంగా జూన్ 5న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కొరియన్ మూవీ 'ఆన్ ఓడె టు మై ఫాదర్' చిత్రానికి ఇది రీమేక్. ఇందులో సల్లూ భాయ్ ఐదు డిఫరెంట్ లుక్స్లో ప్రేక్షకులకు వినోదం పంచబోతున్నారు.