Don't Miss!
- Sports CSK vs LSG: కొంపముంచిన ముస్తాఫిజుర్.. లక్నోను గెలిపించిన స్టోయినిస్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
గంజాయి లీగలైజ్ చేయాలి... అది మన సంస్కృతిలో భాగం: ‘ధూమ్’ స్టార్ సంచలనం
బాలీవుడ్ నటుడు ఉదయ్ చోప్రా గుర్తున్నాడా? బాలీవుడ్ యాక్షన్ సిరీస్ ధూమ్లో బైక్తో విన్యాసాలు చేస్తూ ఒకప్పుడు ప్రేక్షకులను అలరించిన ఈ నటుడు ప్రస్తుతం సినిమాల్లో అంత యాక్టివ్గా లేడు. అయితే తాజాగా ఒక అంశంతో ఉదయ్ చోప్రా మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు.
మారిజునా(గంజాయి) అనే మత్తు పదార్థం గురించి అతడు చేసిన ట్వీట్ సంచలనం అయింది. ఇండియాలో మరిజునా వాడకాన్ని చట్టబద్దం చేయాలి. దీని వల్ల భారీగా ఆదాయం వస్తుంది, అంతే కాకుండా కొన్ని మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అని ఉదయ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది.
ఉదయ్ చోప్రా సంచలన ట్వీట్
‘మారిజునాను చట్టబద్దం చేయాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే... ఇది మన కల్చర్లో ఒక భాగం. దీన్ని చట్టబద్దం చేసి టాక్స్ పరిధిలోకి తెస్తే భారీగా ఆధాయం వస్తుంది. దీని వల్ల చాలా మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అంటూ ఉదయ్ చోప్రా ట్వీట్ చేశారు.
ఓపికగా సమాధానాలు ఇచ్చిన ఉదయ్
మారిజునా గురించి ఉదయ్ చోప్రా చేసిన కామెంటుపై చాలా చర్చ జరిగింది. దీనిపై కొందరు ఉదయ్ చోప్రాకు మద్దతు కూడా తెలుపడం గమనార్హం. మరికొందరైతే దీని వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏమిటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు.
మన సంస్కృతిలో ఇదీ ఒక భాగమా? ఎలా?
గంజాయి వాడకం మన సంస్కృతిలో భాగం ఎలా అవుతుంది? అనే ప్రశ్నకు ఉదయ్ చోప్రా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. హోళీ సెలబ్రేషన్స్లో సేవించే భాంగ్లో శతాబ్దాలుగా వాడుతున్నాం. ఇది మారిజునా లాంటిదే. మహాశివరాత్రి సమయంలో సాధువులు గంజాయి స్మోక్ చేస్తుంటారు అని ఉదయ్ చోప్రా వ్యాఖ్యానించారు.
కాఫీ కూడా డ్రగ్ లాంటిదే
కాఫీ కూడా డ్రగ్ లాంటిదే అంటూ ఓ ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు ఉదయ్ చోప్రా.