Don't Miss!
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- News సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులపై కీలక నిర్ణయం..!!
- Lifestyle ఈ రోజు రాశి ఫలాలు: ఓ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి..సమస్యలు పెరుగుతాయి
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఇలియానాని వాడుకున్నట్లు ఇంకెవరిని వాడుకోవడం లేదట.. మోస్ట్ డేంజరస్!
హాట్ బ్యూటీ ఇలియానా ఒకప్పుడు సౌత్ లో టాప్ హీరోయిన్. టాలీవుడ్ ని వదలి బాలీవుడ్ కు వెళ్లిన తరువాత ఆమెకు అవకాశాలు బాగా తగ్గాయి. అప్పుడప్పుడూ కొన్ని చిత్రాల్లో నటిస్తూ ఫోటో షూట్స్ తో కాలం గడిపింది. తాజాగా ఓ సర్వేలో ఇలియానా ఇండియాలోనే టాప్ సెలేబ్రిటిగా నిలిచింది. అది కూడా ప్రియాంక చోప్రా, దీపిక పదుకొనెని వెనక్కి నెట్టి మరీ టాప్ పొజిషన్ కు చేరుకోవడం విశేషం.
మొదటి స్థానంలో
ప్రతి ఏడాది అమెరికాకు చెందిన మెక్ అఫీ అనే సంస్థ ఇండియాలోని మోస్ట్ డేంజరస్ సెలెబ్రిటీల జాబితాని విడుదల చేస్తుంది. ఈ ఏడాదికి సంబందించిన జాబితాని విడుదల చేయగా ఇలియానా మొదటి స్థానంలో నిలిచింది. ఇలియానా తరువాత స్థానాలలో ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె, ప్రీతి జింత వంటి స్టార్లు నిలిచారు.
Recommended Video
మోస్ట్ డేంజరస్ సెలెబ్రిటీ
ఇది ఇలియానా సాధించిన ఘనత అని భావిస్తే పొరపాటే. సైబర్ నేరాలని దృష్టిలో పెట్టుకుని మెక్ అఫీ సంస్థ ఈ సర్వే నిర్వహిస్తుంది. వీరి సర్వే ప్రకారం సైబర్ నేరగాళ్లు, హ్యాకర్స్ ఎక్కువసార్లు వాడుకున్న సెలెబ్రిటీ మొదటి స్థానంలో నిలుస్తారు. అంటే ఆ రేంజ్ లో ఇలియానాని సైబర్ నేరగాళ్లు వాడుకుంటున్నారన్నమాట.
కవ్వించేలా
ఇలియానా, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె వంటి సెలెబ్రిటీల కవ్వించే ఫొటోలతో వివిధ రకాల మాల్వేర్ అటాక్స్ జరిపి హ్యాకింగ్ కు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. నెటిజన్లని అలెర్ట్ చేయడం కోసమే మెక్ అఫీ సంస్థ ప్రతి ఏడాది ఈ సర్వే నిర్వహిస్తుంది.
రవితేజ చిత్రంలో
ఇక సినిమాల విషయానికి వస్తే ఇలియానా చాలా కాలం తరువాత తెలుగు చిత్రంలో నటిస్తోంది. రవితేజ సరసన ఇలియానా అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనువైట్ల దర్శత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.