ఓటమి ఎఫెక్ట్: అనుష్కను ఇంత దారుణంగా ఎప్పుడూ చూసుండరు
Recommended Video
రెండు రోజుల క్రితం ఇంగ్లండ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ కడదాకా పోరాడినా టీమిండియాను గట్టెక్కించలేకపోయారు. దీంతో భారత్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఈ ఓటమితో కోహ్లీ సతీమణి అనుష్క శర్మపై పంచులు పేలుతున్నాయి.

మీమ్స్ క్రియేట్ చేసి ట్రోల్
తాజాగా ప్రపంచకప్ సెమీస్లో ఓటమితో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సతమతమవుతున్న వేళ.. ఆయన సతీమణి అనుష్క శర్మపైనే టార్గెట్ చేశారు క్రికెట్ అభిమానులు. అనుష్కను డీ గ్లామర్గా చూపిస్తూ కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీటిలో అనుష్క దిగాలుగా కూర్చున్నట్లు ఉన్న ఫొటోలతో పాటు ఏడుస్తున్నట్లుగా కొన్నింటిని క్రియేట్ చేశారు. ఈ ఫొటోలను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కోహ్లీ రాణించలేదంటూ..
ఈ ప్రపంచకప్లో కోహ్లీ ఒక్క సెంచరీ కూడా చేయలేదు. మొత్తంగా తొమ్మిది మ్యాచ్లు ఆడిన కోహ్లీ 55.37 సగటుతో 443 పరుగులు చేశాడు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ కప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అతడు తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. మరో టీమిండియా ఆటగాడు రోహిత్ మాత్రం 648 పరుగులతో ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. అతడి ఖాతాలో ఐదు శతకాలు, ఒక అర్ధ శతకం ఉంది.

అనుష్కనే టార్గెట్
కోహ్లీ గతంలో విఫలమైన సమయంలో అనుష్క శర్మను టార్గెట్ చేసి ట్రోల్ చేశారు చాలా మంది. అతడు సరిగా ఆడలేకపోవడానికి అనుష్కనే కారణం అంటూ సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయారు. అంతేకాదు, కొంత దారుణమైన భాషను సైతం ఉపయోగించి తిట్టిపోశారు. కొన్ని అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు సైతం విడుదల చేశారు.

కోహ్లీ వార్నింగ్ ఇచ్చినా..
అనుష్కను ట్రోల్ చేస్తున్న విషయం తన దృష్టికి రావడంతో కోహ్లీ కూడా సదరు ట్రోలర్లపై ఫైర్ అయ్యాడు. నా ఫెయిల్యూర్స్కు ఆమెను కారణంగా చూపొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు, తానెప్పుడు విఫలమైన అది స్వయంకృపరాధమేనని టీమిండియా కెప్టెన్ స్పష్టం చేశాడు. అయినా.. నెటిజన్లు ఊరుకోవడం లేదు. కోహ్లీ ఎప్పుడు విఫలమైనా అనుష్కనే ట్రోల్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











