Don't Miss!
- News జపాన్ను వణికించిన భూకంపం
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
ఒంటరి సమయంలో ఆమెతో డేటింగ్ చేయాలని ఉంది.. స్టార్ హీరో కూతురు షాకింగ్ కామెంట్
కరోనా ముప్పు సమయంలో అందరూ ఇంటికే పరిమితమయ్యారు. సెలబ్రిటీలు తమకు లభించిన సమాయాన్ని గృహ నిర్బంధంలో ఎంజాయ్ చేస్తున్నారు. స్వీయ గృహ నిర్భంధాన్ని ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్, సూపర్స్టార్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ తాజాగా ఫ్యాన్స్తో సోషల్ మీడియాలో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా ఎవరితో డేటింగ్ చేయాలనుకొంటున్నావని అభిమాని సంధించిన ప్రశ్నకు జవాబు ఇస్తూ..
ఒంటరి సమయంలో
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, ఒంటరిగా ఉన్న నాకు సన్యా మల్హోత్రాతో డేటింగ్ చేయాలని ఉంది. ముందుగా వెంటనే ఆమెను లైన్లోకి తీసుకురండి అంటూ ఇరా సమాధానం ఇచ్చింది. ఆమెతో సరదాగా మాట్లాడుతూ ముచ్చటించుకొంటే భలే ఆనందంగా ఉంటుంది అని చెప్పారు.
ఆమెతో డేటింగ్ ఏంటీ?
ఇరా ఖాన్ డేటింగ్ విషయం బయటపెట్టగానే అభిమాని షాక్ తిన్నారు. ఆమెతో డేటింగ్ ఏంటని ప్రశ్నిస్తే.. ఆమె నాకు మంచి ఫ్రెండ్. సన్యాతో ఉంటే సమయమే తెలియదు. మా మధ్య మంచి స్నేహం ఉంది. అందుకే నా స్నేహితురాలితో ఉండాలని అనుకంటున్నాను అని ఇరా ఖాన్ చెప్పింది. అయితే ఇరా మనసులో మాటపై సన్యా ఎలా స్పందిస్తుందో చూడాలి
దంగల్లో బబితా ఫోగట్గా
సన్యా మల్హోత్రా ఎవరో కాదు. అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమాలో బబితా ఫోగట్ పాత్రలో నటించి మెప్పించింది. ఆ చిత్రంలో ఆమె పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. దంగల్ తర్వాత అయుష్మాన్ ఖురానా చిత్రం బాదాయి హో, అమీర్తో కలిసి థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రంలో నటించింది.
Recommended Video
బాలీవుడ్లో ఎంట్రీకి ప్లాన్
ఇక ఇరా విషయానికి వస్తే.. బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. త్వరలోనే ఆమె దర్శకత్వ శాఖలో ప్రవేశించే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే ఓ మ్యూజిక్ డైరెక్టర్తో అఫైర్ కొనసాగిస్తున్నదనే వార్తలు మీడియాలో గుప్పుమంటున్నాయి.