Don't Miss!
- Sports DC vs SRH:ట్రావిస్ హెడ్, షెహ్బాజ్ అహ్మద్ విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
మరోసారి తెలుగులో నటించాలని అనుకున్న ఇర్ఫాన్ ఖాన్.. గోపిచంద్ సినిమాలో జస్ట్ మిస్?
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణ వార్త సినీ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. గత కొన్నేళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో కన్నుమూశారు. దీంతో బాలీవుడ్ ప్రముఖ నటులు ఈ షాక్ నుండి కొలుకోలేకపోతున్నారు. లాక్ డౌన్ సమయంలో ఆయనను కడసారి చూసే పరిస్థితి కూడా లేదు. బాలీవుడ్, హాలీవుడ్ అనే కాకుండా తెలుగుతెరపై కూడా ఇర్ఫాన్ ఖాన్ కనిపించారు.
Recommended Video
సైనికుడు సినిమాలో విలన్..
2006లో మహేష్ బాబు కథానాయకుడిగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన సైనికుడు సినిమాలో ఇర్ఫాన్ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. అప్పటికే బిజీగా ఉన్న ఇర్ఫాన్ ఖాన్ ఆ సినిమా కోసం డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఇబ్బంది పడ్డారు. భారీ అంచనాలతో విడుదలైన ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా ఇర్ఫాన్ ఖాన్ నటనకు తెలుగు ఆడియెన్స్ ఫిదా అయ్యారు.
మరో సినిమా చేయాలని..
హాలీవుడ్,
బాలీవుడ్
ఇండస్ట్రీలలో
ఇర్ఫాన్
ఖాన్
తీరిక
లేకుండా
సినిమాలు
చేస్తున్న
సమయంలో
టాలీవుడ్
సినిమాలలో
కూడా
నటించాలని
గత
కొన్నేళ్లుగా
అనుకున్నారట.
మధ్య
మధ్యలో
కొన్ని
ఆఫర్స్
వచ్చినప్పటికీ
నచ్చక
వదిలేశారట.
ఇక
మరికొన్నిటిని
డేట్స్
అడ్జస్ట్
చేయలేక
వధులుకోవాల్సి
వచ్చిందట.
అదే చివరి సినిమా..
ఆ మధ్య కాలంలో దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటి సాహసం సినిమా విలన్ పాత్రకు ఇర్ఫాన్ ఖాన్ అయితే బావుంటుందని ఆయనని సంప్రదించారట. గోపిచంద్ హీరోగా నటించిన ఆ సినిమాలో ఇర్ఫాన్ ఖాన్ కూడా నటించాలని అనుకున్నారు కానీ ఎందుకో కుదరలేదట. టాలీవుడ్ లో చివరగా 2006లో మాత్రమే కనిపించిన ఇర్ఫాన్ తెలుగు సినిమాల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సమయంలో మరణించడం తెలుగు జనాలను కూడా కలచివేస్తోంది.
తల్లి మరణించిన కొన్ని రోజులకే..
ఈ నెల 25న ఇర్ఫాన్ ఖాన్ తల్లి సైదా బేగం మృతి చెందింది. అయితే లాక్ డౌన్ కారణంగా ఇర్ఫాన్ కడసారి కూడా తన తల్లిని చూసుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు క్యాన్సర్ భారిన పడి శాశ్వతంగా తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడాని ఇర్ఫాన్ కుటుంబం సభ్యులు శోక సంద్రంలో మునిగారు. హాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు కూడా ఇర్ఫాన్ ఖాన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.