Don't Miss!
- News పవన్ అప్పుల చిట్టా రూ. 46,70,00,000: `వదిన` దగ్గర పర్సనల్ లోన్
- Sports CSKకి కొత్త సమస్య.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఎలా?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అక్కకు షాక్ ఇచ్చిన చెల్లి.. స్టార్ హీరో తప్పేమి లేదంటూ సపోర్ట్!
గత ఏడాది మీటూ ఉద్యమం బాలీవుడ్ ని కుదిపేసింది. సీనియర్ హీరోయిన్ తనుశ్రీ దత్త ప్రముఖ నటుడు నానా పాటేకర్ పై చేసిన లైంగిక వేధింపుల సంచలనం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలతోనే బాలీవుడ్ లో మీటూ ఉద్యమం మొదలైంది. తనుశ్రీ దత్తా ఇచ్చిన ధైర్యంతో చాలా మంది నటీమణులు తమకు ఎదురైన వేధింపులని వివరిస్తూ పలువురు దర్శకులు, నిర్మాతలు, నటుల పేర్లు బయట పెట్టారు. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం నుంచి సీనియర్ నటుడు అలోక్ నాథ్ విషయంలో అజయ్ దేవగన్, తనుశ్రీ దత్తా మధ్య వివాదం కొనసాగుతోంది. దీనిపై తనుశ్రీ దత్తా చెల్లి ఇషితా దత్తా స్పందించింది.
అజయ్ దేవగన్పై విమర్శలు
అలోక్ నాథ్ పై అత్యాచార ఆరోపణలు ఉన్నాయని తెలిసి కూడా అతడికి ఎందుకు దే దే ప్యార్ దే చిత్రంలో అవకాశం ఇచ్చారు అంటూ తనుశ్రీ దత్తా అజయ్ దేవగన్ ని ప్రశ్నించింది. మహిళల పట్ల మీకున్న గౌరవం ఇదేనా అంటూ అజయ్ దేవగన్ పై విమర్శలు చేసింది. అలోక్ నాథ్ పై అత్యాచార ఆరోపణలు వచ్చిన వెంటనే అతడిని మీ చిత్రం నుంచి తొలగించి ఉండాల్సింది. కానీ అలా చేయకుండా అతడిని మీ చిత్రంలో కొనసాగించడం వెనుక ఉద్దేశం ఏంటని తనుశ్రీ ప్రశ్నించింది.
తొలగించడం కుదరదు
దే దే ప్యార్ దే చిత్రం నుంచి అలోక్ నాథ్ ని తొలగించడం కుదరదని అజాయ్ దేవగన్ తేల్చి చెప్పేశారు. మీటూ ఉద్యమం గత ఏడాది అక్టోబర్ లో ప్రారంభమైంది. సెప్టెంబర్ లోనే మా చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తయిపోయింది. అలోక్ నాథ్ ఈ చిత్రంలో చాలా కీలకమైన పాత్రలో నటించారు. దాదాపు 40 రోజుల పాటు ఆయన షూటింగ్ లో పాల్గొన్నారు. అతడిని తొలగించి మరొకరిని తీసుకున్నా సినిమా బడ్జెట్ డబుల్ అవుతుంది అని అజయ్ దేవగన్ వివరణ ఇచ్చాడు.
దృశ్యం చిత్రంలో
ఇదిలా ఉండగా తనుశ్రీ దత్త చెల్లి ఇషిత దత్తా దృశ్యం చిత్రంలో అజయ్ దేవగన్ కుమార్తె పాత్రలో నటించింది. తనుశ్రీకి, అజయ్ దేవగన్ కి మధ్య జరిగుతున్న వివాదం గురించి ఇషిత తాజాగా స్పందించింది. తాను ప్రస్తుతం చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నానని ఇషిత తెలిపింది. కానీ సత్యం ఎప్పటికి సత్యమే. వారి మధ్య జరుగుతున్న వివాదానికి.. అజయ్ దేవగన్ సర్ పై నాకున్న అభిమానానికి ఎలాంటి సంబంధం లేదు అని ఇషిత తెలిపింది.
అక్కకు షాక్ ఇచ్చిన చెల్లి
ఇక వివాదం గురించి మాట్లాడుతూ అజయ్ దేవగన్ సర్ ఎవరిపైనా అనవసరంగా ఆగ్రహం వ్యక్తం చేయరు. అసహనానికి గురి కారు. అలోక్ నాథ్ ని తొలగించడం అజయ్ దేవగన్ సర్ చేతుల్లో లేని పని అని నేను నమ్ముతున్నాడు. దే దే ప్యార్ దే చిత్రానికి ఆయన మాత్రమే నిర్మాత కాదు కదా అంటూ ఇషిత అజయ్ దేవగన్ కు మద్దతు తెలిపింది.