Jacqueline Fernandez రాసలీలలు.. సుకేష్తో ముద్దులు మురిపాలు.. మెడపై గాటుతో ఫోటో లీక్!
బాలీవుడ్ హీరోయిన్ జాక్వలైన్ ఫెర్నాండేజ్ రొమాంటిక్ జీవితం మరోసారి బట్టబయలైంది. 200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేష్ చంద్రశేఖర్తో రాసలీల వ్యవహారం మరోసారి మీడియాలో లీక్ అయింది. అయితే ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ విచారణను ఎదుర్కొంటున్న జాక్వలైన్ ఫెర్నాండేజ్తో సుకేష్ చంద్రశేఖర్ రొమాన్స్లో మునిగితేలుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ ఫోటో వివరాల్లోకి వెళితే..

రాన్ బాక్సీ ప్రమోటర్లకు బెదిరింపులతో
తమిళనాడుకు చెందిన సుకేష్ చంద్రశేఖర్ 200 కోట్ల మేర బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు. ప్రముఖ మెడికల్ కంపెనీ రాన్ బాక్సీ ప్రమోటర్లను బెదిరింపులకు పాల్పడి భారీ మొత్తంలో అక్రమ సంపాదన కూడబెట్టుకొన్నారనే ఆరోపణలపై ఆయనను అరెస్ట్ చేసి తీహార్ జైలులో పెట్టారు. అయితే జైలు నుంచి కేంద్ర హోంమంత్రి అమితా షా పేరు ఉపయోగించుకొంటూ కొందరితో లావాదేవీలు జరిపారు. అంతేకాకుండా జాక్వలైన్తో సుకేష్ ఫోన్లో సంప్రదింపులు జరిపారనే విషయం ఈడీ అధికారుల విచారణలో తేలింది.

మనీలాండరింగ్ కేసులో జాక్వలైన్..
సుకేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో జాక్వలైన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహిలను ఈడీ అధికారులు పలుమార్లు విచారించారు. జాక్వలైన్కు విలాసవంతమైన బహుమతులు, ముంబైలో సముద్ర తీరానికి సమీపంలో కళ్లు చెదిరే బంగ్లా, కారు లాంటి ఇచ్చారనే విషయం ఈడీ అధికారుల విచారణలో తేలింది. దాంతో ఆమెపై ఈడీ నజర్ పెట్టింది. అయితే ఈ వార్తలపై జాక్వలైన్ మౌనంగాా ఉండటం అనేక సందేహాలు తలెత్తాయి.

సుకేష్, జాక్వలైన్ రాసలీలలు
మాఫియా డాన్ సుకేష్ చంద్రశేఖర్ గత ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో జైలు నుంచి బెయిల్పై విడుదలైనప్పుడు జాక్వలైన్ ఆయనతో దిగిన సెల్ఫీ మీడియాలో వెలుగుచూసింది. జాక్వలైన్ బుగ్గపై సుకేష్ ముద్దు పెడుతూ తన ఎదురుగా ఉన్న అద్దంలో చూసుకొంటూ ఐఫోన్తో సెల్ఫీ తీస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తాజాగా జాక్వలైన్ రొమాంటిక్ ఫోటో లీక్
ఇదిలా ఉండగా, తాజాగా సుకేష్, జాక్వలైన్ ఫెర్నాండేజ్కు సంబంధించిన మరో రొమాంటిక్ ఫోటో సోషల్ మీడియాలో లీక్ అయింది. ఒకరినొకరు చాలా సన్నిహితంగా ఉంటూ ముద్దుల్లో మునిగిపోయారు. వారిద్దరూ రొమాన్స్ మునిగిపోయి తన్మయత్వంతో ప్రపంచాన్ని మరిచిపోయారనే విధంగా ఫోటో ఉంది. అంతేకాకుండా జాక్వలైన్ మెడపై ఎర్రటి గాటుగా ఉండటం వారిద్దరూ ఏ రేంజ్లో సరసాలు ఆడుకొన్నారనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
Recommended Video

ఐఫోన్ 12తో ఫోటోలు అంటూ ఈడీ
సుకేష్, జాక్వలైన్ ఫెర్నాండేజ్తో దిగిన రొమాంటిక్ సెల్ఫీ గురించి ఈడీ అధికారులు స్పందిస్తూ.. జాక్వలైన్ను ఐఫోన్ 12తో తీశాడు. ఇజ్రాయెల్ సిమ్ కార్డుతో కూడిన ఫోన్ను సుకేశ్ వాడారు. సుకేష్ను కలుసుకోవడానికి జాక్వలైన్ ఫెర్నాండేజ్ నాలుగు సార్లు చెన్నై నగరానికి ప్రైవేట్ జెట్లో వెళ్లింది అని ఈడీ అధికారులు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











