తల్లి శ్రీదేవిని గుర్తు చేసుకంటూ... అరుదైన ఫోటో పోస్టు చేసిన జాహ్నవి!

By Bojja Kumar

Recommended Video

Janhvi Tweets About Actress Sridevi

ఇండియన్ సినిమా రంగంలో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన శ్రీదేవి జాహ్నవి, ఖుషీ పుట్టిన తర్వాత సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దాదాపు 15 సంవత్సరాల పాటు తన ఇద్దరు కూతుర్లే ప్రపంచంగా బ్రతికింది. అద్భుతమైన కెరీర్ ఉన్నా పిల్లల కోసం త్యాగం చేసింది.

ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన ఈ అతిలోక సుందరి మళ్లీ నటిగా తన సత్తా చాటుతున్న సమయంలో ఎవరూ ఊహించని విధంగా మృత్యువు ఓడిలోకి వెళ్లిపోయి అభిమానులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. నేడు శ్రీదేవి 55వ జయంతి. ఆమె మరణం తర్వాత వచ్చిన తొలి పుట్టినరోజు ఇది. ఈ సందర్భంగా అభిమానులు తమ ఆరాధ్య దేవతను తలుచుకుంటున్నారు.

Janhvi Instagram Post on Sridevi’s Birth Anniversary

శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ తల్లి పుట్టినరోజు సందర్భంగా ఓ అరుదైన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. అమ్మానాన్నలతో కలిసి ఉన్న ఈ మధుర జ్ఞాపకంతో జాహ్నవి మళ్లీ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయింది. శ్రీదేవి ఉండి ఉంటే ఈ రోజు పెద్ద వేడుక జరిగేది. కానీ విధి ఆడిన వింత నాటకంలో సంతోషాలు పరవళ్లు తొక్కాల్సిన ఈ రోజున కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు ఆమె జ్ఞాపకాలతో విషాదంలో ఉండిపోవాల్సి వచ్చింది.

అంతకు ముందు జాహ్నవి ఓ ఇంటర్వ్యూలో తల్లి గురించి మాట్లాడుతూ... తన జీవితంలో అమ్మ ది బెస్ట్. అమ్మ ఇచ్చిన ఇన్స్‌స్పిరేషన్‌తో మరింత ధైర్యంగా ముందుకకు సాగుతున్నాను. అమ్మను తలుచుకోకుండా ఏ పని చేయను అన్నారు.

మరో వైపు శ్రీదేవి తొలి జయంతిని పురస్కరించుకుని ముంబైలోని చాపెల్ రోడ్డులో ఓ బిల్డింగుపై 18 అడుగుల భారీ పెయింట్ వేశారు. ఈ సందర్భంగా బోనీ కపూర్ మాట్లాడుతూ... శ్రీదేవిని అనుక్షణం తలుచుకుంటూనే ఉన్నాం. మా జ్ఞాపకాల్లో ఆమె జీవించే ఉంది. లెజెండ్స్‌కు మరణం లేదు అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X