Don't Miss!
- News డెడ్ లైన్ పెట్టిన ఎంపీ సుమలత, ఆ రోజు తేలిపోతుంది, టెన్షన్ పడుతున్న మాజీ సీఎం !
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
జాన్వీ బ్యాడ్ లక్.. అంత మంచి సినిమా ఓటీటీలోనా?.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!
అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ తన అందంతో ఇప్పటికే మంచి క్రేజ్ అందుకుంది. మొదటి సినిమా దడఖ్ ఊహించని దెబ్బ కొట్టినప్పటికి తన నటనతో అలాగే గ్లామర్ పరంగా అమ్మడు మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇక నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్ అందుకోవాలని అనుకుంటే అమ్మడిని మరోసారి దురదృష్టం వెంటాడింది.
మొదటి సినిమా..
2018లో వచ్చిన దడఖ్ సినిమాతోనే జాన్వీ హిట్టు కొట్టడం గ్యారెంటీ అనే రేంజ్ లో వార్తలు జోరుగా వచ్చాయి. ఆ సినిమా రిలీజ్ కు ముందు మంచి బజ్ క్రియేట్ చేసింది. మరాఠీ సినిమా సైరత్ సినిమాకు రీమేక్ గా వచ్చిన విషయం తెలిసిందే. అయితే సినిమా రిలీజ్ తరువాత మాత్రం బాలీవుడ్ ఆడియెన్స్ కి ఆ సినిమా అంతగా ఎక్కలేదు. జాన్వీ మొదటి సినిమా ఈ విధంగా ఉంటుందని అనుకోలేదనే కామెంట్స్ వచ్చాయి.
కరోనా దెబ్బ..
మొదటి సినిమాతోనే ఊహించని ఫలితాన్ని అందుకున్న జాన్వీ కపూర్ ఆ తరువాత ఒక వెబ్ సిరీస్ లో నటించింది. అనంతరం కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మొట్ట మొదటి హెలికాప్టర్ పైలెట్ గుంజన్ సక్సేనా బయోపిక్ లో నటించింది. గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్ అనే ఈ సినిమా లాక్ డౌన్ కంటే ముందే పూర్తయింది. కరెక్ట్ గా రిలీజ్ చేసే సమయంలో కరోనా దెబ్బ పడింది.
|
బ్యాడ్ లక్..
మొదటి సినిమాతో బాక్సాఫీస్ దక్కలేదని బాధతో ఉన్న జాన్వీ ఇప్పుడు గుంజన్ సక్సేనా బయోపిక్ కూడా థియేటర్స్ లో రిలీజ్ కాకపోవడంతో కాస్త అప్సెట్ అయ్యిందట. ఎందుకంటే ద కార్గిల్ గర్ల్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ చేసి బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని జాన్వీ చాలా ఆశపడింది. ఆ సినిమా రిజల్ట్ పై అమ్మడు అంధరికంటే ఎక్కువ నమ్మకంతో ఉందట. కానీ ప్రస్తుత పరిస్థితుల వల్ల థియేటర్స్ లో రిలీజ్ చేసే ఛాన్స్ లేదని నిర్మాత డైరెక్ట్ గా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో రిలీజ్ చేస్తున్నాడు.
రిలీజ్ ఎప్పుడంటే..
ఒక ఎమోషనల్ వీడియో ద్వారా నిర్మాత కరణ్ జోహార్ సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియోకు జాన్వీ మంచి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చింది. ఇకపోతే సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ పై చిత్ర యూనిట్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. కానీ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. బాలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా వచ్చే ఆగస్ట్ 15వ తేదీన గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్ ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.