Don't Miss!
- Sports ధోనీ సార్ ధోనీ.. అంతే: సౌండ్ లెవెల్ ఏ రేంజ్లో ఉందంటే..
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఫోటోస్ వైరల్: బాలీవుడ్ ఫ్యూచర్ క్వీన్ జాహ్నవి కపూర్...
Recommended Video
శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ ఇపుడు బాలీవుడ్లో సరికొత్త సెన్సేషన్. త్వరలో 'ధడక్' సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయం కాబోతున్న ఈ కపూర్ బేటీ ఫ్యూచర్లో బాలీవుడ్ ఫ్యాషన్ క్వీన్గా ఇండస్ట్రీని ఏలడం ఖాయం అని, తన అందంతో హిందీ పరిశ్రమను అల్లాడిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రబల్ గురుంగ్ అనే ఇంటర్నేషనల్ డిజైనర్ బుధవారం జాహ్నవిని కలిశాడు. ఆమె కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన లేటెస్ట్ ట్రెండీ ఔట్ఫిట్స్ తీసుకొచ్చాడు. ఈ దుస్తువుల్లో జాను సరికొత్త లుక్తో దర్శనమిచ్చి అభిమానుల మతి పోగొట్టింది.
|
వైరల్ అవుతున్న జాహ్నవి మిడ్ రిప్ ఫోటోస్
ఈ సందర్భంగా బాలీవుడ్ ఫ్యూచర్ ఫ్యాషన్ క్వీన్ జాహ్నవి అంటూ ప్రబల్ ట్వీట్ చేశాడు. మిడ్ రిప్స్ ఎక్స్ ఫోజ్ అయ్యేలా అతడు డిజైన్ చేసిన దుస్తువుల్లో జాహ్నవి మరింత అందంగా, హాట్గా కనిపిస్తోందంటూ ఈ ఫోటోలపై కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
అమెరికన్ బేస్డ్ డిజైనర్
ప్రబల్ గురుంగ్ నేపాలీ సంతతికి చెందిన అమెరికన్ డిజైనర్. న్యూయార్క్ కేంద్రంగా పలువురు హాలీవుడ్ సెలబ్రిటీల కోసం సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్స్ డిజైన్ చేస్తూ ఇంటర్నేషనల్ వైడ్ పాపులర్ అయ్యాడు. అతడి క్లయింట్ల ఖాతాలో ఇపుడు జాహ్నవి కపూర్ కూడా చేరిపోయింది.
షూటింగులో జాహ్నవి బిజీ
జాహ్నవి కపూర్ త్వరలో ‘ధడక్' సినిమా ద్వారా వెండితెరకు పరిచయం కాబోతోంది. జులై 6 ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ షూటింగ్ చివరి దశలో ఉంది. తల్లి శ్రీదేవి మరణం, ఇటీవల సోనమ్ కపూర్ పెళ్లి కారణంగా జాహ్నవి సెలవు తీసుకోవడంతో షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.
ధడక్
‘ధడక్' చిత్రానికి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్నారు. మరాఠీ హిట్ మూవీ సైరాట్ చిత్రానికి ఇది రీమేక్. జాహ్నవికి పోడీగా హిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ నటిస్తున్నాడు. ధర్మాప్రొడక్షన్స్ బేనర్లో కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.