Don't Miss!
- News ఈ అభిమానమే రఘురామ రాజుకు సీటు దూరం చేసింది..!!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
100 కోట్ల ధడక్.. వసూళ్లు జోరు!.. హృదయాల్ని గెలుచుకొన్న జాహ్నవి !
బాక్సాఫీస్ వద్ద ఢడక్ చిత్ర కలెక్షన్ల జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. జూలై 20న రిలీజైన ఈ చిత్రం సరికొత్త మైలురాయిని చేరుకొన్నది. యువ దర్శకుడు శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో మరాఠీ చిత్రం సైరత్ రీమేక్గా రూపొందింది. ఈ చిత్రంలో శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్, షాహీద్ కపూర్ సోదరుడు ఇషాన్ కట్టర్ జంటగా నటించారు. కొత్త తారలతో రూపొందించిన ఈ చిత్రం వంద కోట్ల క్లబ్లో చేరింది.
పది రోజుల్లో వందకోట్లు
ధడక్ చిత్రం తొలివారాంతంలోనే రూ.33.76 కోట్లు కొల్లగొట్టింది. ఆ తర్వాత తొలివారంలో రూ.63.39 కోట్లు వసూలు చేసింది. పదిరోజల తర్వాత ధడక్ చిత్రం రూ.100 కోట్ల క్లబ్లో చేరడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. రెండో వారంలో కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్లతో దూసుకెళ్తున్నది.
|
కరణ్ జోహర్ ట్వీట్
ధడక్ చిత్రం 100 కోట్ల క్లబ్లో చేరడంపై నిర్మాత కరణ్ జోహర్ స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల హృదయాలను ధడక్ చిత్రం గెలుచుకొన్నది. వరల్డ్ వైడ్ రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. కొత్త హీరో, హీరోయిన్లతో తీసిన ఈ చిత్రానికి ఈ రేంజ్లో కలెక్షన్లు రావడం అరుదైన విషయం. ఈ విజయానికి కారణమైన జాహ్నవి, ఇషాన్ను అభినందిస్తున్నాను అని కరణ్ ట్వీట్ చేశారు.
జాహ్నవి మ్యాజిక్
ధడక్ విజయానికి కారణం జాహ్నవి మాత్రమే అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ చిత్రం షూటింగ్ జరుపుకొంటుండగా.. అలనాటి అందాల తార శ్రీదేవి ఆకస్మిక మరణం పొందారు. ఆ విషాదంలో నుంచి త్వరగా తేరుకొని జాహ్నవి ధడక్ షూటింగ్ హాజరయ్యారు. ఆ షూటింగ్ జాహ్నవి మనోనిబ్బరం చూసి సినీ వర్గాలు ఆశ్చర్యానికి గురయ్యారు.
అమ్మ చెప్పడంతోనేనని జాహ్నవి
నా తల్లి మరణం తర్వాత నన్ను తీవ్ర విషాదం వెంటాడింది. అయితే ఆ విషాదం నుంచి బయటపడాలని గట్టిగా నిర్ణయం తీసుకొన్నాను. అందుకే అంత్యక్రియలు జరిగిన మరుసటి రోజే నేను షూటింగ్ హాజరుకావాలనుకొన్నాను. కానీ షూటింగ్ లేకపోవడంతో సాధ్యపడలేదు. ఎన్నీ అడ్డంకులు ఎదురైనా ప్రొఫెషనల్గా వ్యవహరించాలని నా తల్లి చెప్పేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జాహ్నవి వెల్లడించారు.