Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
దివ్యభారతీ, శ్రీదేవి మరణాలు తెరపైకి.. జియాఖాన్ కేసును సిబీఐకి అప్పగించాలి అంటూ
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసును సీబీఐ అప్పగించడంపై అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. బాలీవుడ్లో చోటుచేసుకొన్న కొన్ని అనుమానాస్పద మరణాలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలనే డిమాండ్ ఊపందుకొన్నది. దివ్యభారతీ, శ్రీదేవి మరణాలపై దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇతర అనుమానాస్పద మరణాల వివరాల్లోకి వెళితే..
Recommended Video
జియాఖాన్ మరణంపై అనుమానాలు
బాలీవుడ్లో సంచలనం రేపిన జియా ఖాన్ మరణంపై ఇప్పటికీ ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి కుమారుడు సూరజ్ పంచోలి నటి జియా ఖాన్ మరణానికి కారణమనే ఆరోపణలు వచ్చాయి. రాజకీయ, సినీ వర్గాల ఒత్తిడి కారణంగా జియా ఖాన్ కేసును తప్పుదోవ పట్టిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జియా తల్లి రిబియా ఖాన్ ఇప్పటికీ తన కూతురు మరణం వెనుక కారణాలు, ఉన్న వ్యక్తుల పేర్లు బయటకు రావాలని డిమాండ్ చేస్తున్నారు.
దివ్య భారతి మృతిపై సందేహాలు
బాలీవుడ్ యువతార దివ్య భారతీ మరణంపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎత్తైన భవనంపై నుంచి దూకి ప్రమాదవశాత్తు మరణించారనే వార్తలపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. నిర్మాత సాజిద్ నడియావాలాతో అఫైర్ కారణంగానే దివ్య భారతీ మరణించారనే విషయం ఆరోపణలుగానే మిగిలిపోయాయి.
దుబాయ్లో శ్రీదేవి అనుమానాస్పదంగా
ఇక
రెండేళ్ల
క్రితం
దుబాయ్లో
శ్రీదేవి
మరణం
కూడా
అనేక
అనుమానాలకు
దారి
తీసింది.
దుబాయ్లోని
బాత్రూంలోని
టబ్లో
మునిగి
మరణించారనే
విషయంపై
సందేహాలు
వ్యక్తమయ్యాయి.
శ్రీదేవి
మరణం
వెనుక
వాస్తవాలను
బయటకు
తీసుకురావాలనే
డిమాండ్
నెటిజన్ల
నుంచి
వ్యక్తమవుతున్నది.
బాలీవుడ్లో పర్వీన్ బాబీ, ఇతర నటులు
అలాగే గతంలో మరణించిన పర్వీన్ బాబీ, ఇతర మరణాలపై కూడా దర్యాప్తు చేయాలనే డిమాండ్ వస్తున్నది. సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించడంపై నెటిజన్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్లో ఓ వర్గం మాఫియాతో సంబంధాలున్నాయనే విషయంపై దర్యాప్తు చేపట్టాలని కూడా డిమాండ్ లేవనెత్తుతున్నారు.