twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హైదరాబాద్ లో షూటింగ్ స్టార్ట్ చేయనున్న జాన్ అబ్రహమ్

    |

    టీవీ షూటింగ్ లకు, సినిమా షూటింగ్ లకూ మెల్లగా తెరలేపిన బాలీవుడ్ చిత్ర సీమ, ఇప్పుడు తెలంగాణాలోనూ అడుగుపెట్టేందుకు సమాయత్తం అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో నూ పాక్షికంగా లాక్ డౌన్ ఎత్తివేయడంతో క్రమంగా షూటింగ్ లు ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఓ బాలీవుడ్ షూటింగ్ జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి వినతి పత్రం అందింది.

    జాన్ అబ్రహం, ఇమ్రాన్ హష్మీ నటిస్తున్న ముంబై సాగా చిత్ర షూటింగ్ పునఃప్రారంభానికి హైదరాబాద్, రామోజీ ఫిల్మ్ సిటీనే సరైన వేదిక అని భావించిన డైరెక్టర్ సంజయ్ గుప్తా ఈ మేరకు తెలంగాణా ప్రభుత్వానికి వినతి పత్రం అందించినట్లు తెలుస్తోంది. అనుమతి లభిస్తే, వచ్చేనెల షూటింగ్ ప్రారంభమవ్వనుంది.12 రోజుల పాటూ జరగనున్న ఈ సినిమా షూటింగ్ లో జాన్, ఇమ్రాన్ తో పాటూ, సీనియర్ నటులు సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్ కూడా పాలుపంచుకోనున్నారు. ఫిల్మ్ సిటీ లో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది.

    John Abrahams Mumbai Saga in Hyderabad

    ఫిల్మ్ సిటీ షూటింగ్ కు అనుకూలంగా ఉండటంతో పాటూ, సినిమా బృందం మొత్తానికి బస చేసేందుకు కావాల్సిన హోటళ్లు, ఇతర సదుపాయాలన్నీ కూడా అక్కడే అందుబాటులో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దర్శకుడు సంజయ్ తెలిపారు. నిర్మాత భూషణ్ కుమార్ సైతం, తమ చిత్ర బృందం ఆరోగ్య క్షేమమే తమకు ముఖ్యమని వ్యాఖ్యానించారు.

    English summary
    John Abraham new film Mumbai Saga to start the shoot at Ramoji FilmCity in Hyderabad. The crew is waiting for a go ahead signal from Telangana Govt. Popular actors like Emran Hashmi, Suniel Shetty, Pratiek Babbar, Jackie Shroff to star in the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X