Don't Miss!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
హైదరాబాద్ లో షూటింగ్ స్టార్ట్ చేయనున్న జాన్ అబ్రహమ్
టీవీ షూటింగ్ లకు, సినిమా షూటింగ్ లకూ మెల్లగా తెరలేపిన బాలీవుడ్ చిత్ర సీమ, ఇప్పుడు తెలంగాణాలోనూ అడుగుపెట్టేందుకు సమాయత్తం అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో నూ పాక్షికంగా లాక్ డౌన్ ఎత్తివేయడంతో క్రమంగా షూటింగ్ లు ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఓ బాలీవుడ్ షూటింగ్ జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి వినతి పత్రం అందింది.
జాన్ అబ్రహం, ఇమ్రాన్ హష్మీ నటిస్తున్న ముంబై సాగా చిత్ర షూటింగ్ పునఃప్రారంభానికి హైదరాబాద్, రామోజీ ఫిల్మ్ సిటీనే సరైన వేదిక అని భావించిన డైరెక్టర్ సంజయ్ గుప్తా ఈ మేరకు తెలంగాణా ప్రభుత్వానికి వినతి పత్రం అందించినట్లు తెలుస్తోంది. అనుమతి లభిస్తే, వచ్చేనెల షూటింగ్ ప్రారంభమవ్వనుంది.12 రోజుల పాటూ జరగనున్న ఈ సినిమా షూటింగ్ లో జాన్, ఇమ్రాన్ తో పాటూ, సీనియర్ నటులు సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్ కూడా పాలుపంచుకోనున్నారు. ఫిల్మ్ సిటీ లో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది.
ఫిల్మ్ సిటీ షూటింగ్ కు అనుకూలంగా ఉండటంతో పాటూ, సినిమా బృందం మొత్తానికి బస చేసేందుకు కావాల్సిన హోటళ్లు, ఇతర సదుపాయాలన్నీ కూడా అక్కడే అందుబాటులో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దర్శకుడు సంజయ్ తెలిపారు. నిర్మాత భూషణ్ కుమార్ సైతం, తమ చిత్ర బృందం ఆరోగ్య క్షేమమే తమకు ముఖ్యమని వ్యాఖ్యానించారు.