Don't Miss!
- News ఫోన్ ట్యాపింగ్ కేసు: మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు 14 రోజుల రిమాండ్
- Sports RCB vs KKR: చెలరేగిన కోహ్లీ, కార్తీక్.. కేకేఆర్ ముందు భారీ లక్ష్యం!
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
కంగన, క్రిష్ వివాదం గురించి విజయేంద్ర ప్రసాద్.. ఇద్దరి గురించి అలా చెబుతూ!
కంగనా రనౌత్ నటించిన మణికర్ణిక చిత్రం విజయ పథంలో దూసుకుపోతోంది. వీరనారి లక్ష్మీభాయిగా కంగనా చెలరేగి నటించింది. ఈ చిత్రంలో కంగనా రనౌత్ నటన పవర్ ఫుల్ గా ఉందంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. కానీ ఈ చిత్ర విషయంలో నెలకొన్న వివాదం మాత్రం కొనసాగుతూనే ఉంది. షూటింగ్ చివరి దశలో కంగనా రనౌత్ తో విభేదాలు ఏర్పడడంతో క్రిష్ మణికర్ణిక చిత్రం నుంచి తప్పుకున్నాడు. ఈ వివాదంపై ఎట్టకేలకు రచయిత విజయేంద్ర ప్రసాద్ స్పందించారు.
70 శాతం నేనే
కంగనా రనౌత్ ఈ చిత్రానికి 70 శాతం నేనే దర్శత్వం వహించానని కంగనా రనౌత్ చెప్పుకుంది. దీనిపై వివాదం చెలరేగింది. దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ.. తానే 70 శాతం షూటింగ్ చేసానని అన్నారు. కంగనా రనౌత్ కేవలం 30 శాతం మత్రమే చేసింది. ఫస్టాఫ్ లో 10 శాతం సన్నివేశాలు, సెకండ్ హాఫ్ లో 20 శాతం సన్నివేశాలు మాత్రమే కంగనా రనౌత్ చిత్రీకరించిందని క్రిష్ తెలిపారు.
మణికర్ణిక: సోనూ సూద్ వీడియో లీక్.. ఖతర్నాక్ సీన్, కంగనా చెడగొట్టిందిగా?
కంగనాకు మద్దత్తుగా
కంగనా రనౌత్ కు మద్దత్తుగా కొందరు బాలీవుడ్ సెలెబ్రిటీలు, సోదరి నిలిచారు. క్రిష్ తరుపున కూడా కొందరు మాట్లాడారు. కానీ నిర్మాణ సంస్థ మాత్రం ఈ వివాదంలో తలదూర్చలేదు. కథ విషయంలో కంగనా, క్రిష్ మధ్య విభేదాలు తలెత్తి చిత్రం నుంచి తప్పుకునేవరకు పరిస్థితి వచ్చింది. దీనిపై చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ ఎట్టకేలకు స్పందించారు.
విజయేంద్ర ప్రసాద్
ఈ వివాదం గురించి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. తాను చిత్ర సెట్స్ లో పెద్దగా లేనని అన్నారు. కాబట్టి ఏ సన్నివేశాలు ఎవరు చిత్రీకరించారో నాకు తెలియదు. కానీ కథకు మాత్రం క్రిష్, కంగనా రనౌత్ ఇద్దరూ తమ సలహాలు ఇచ్చారు. వీళ్ళిద్దరూ మంచి క్రియేటివిటీ కలిగిన వాళ్ళే అని విజయేంద్ర ప్రసాద్ ప్రశంసించారు. వివాదాన్ని పెద్దది చేయకుండా సక్సెస్ ని ఎంజాయ్ చేయాలని విజయేంద్ర ప్రసాద్ కోరారు.
యాక్షన్ సన్నివేశాలలో
ఈ చిత్ర విజయంలో కంగనా రనౌత్, క్రిష్ ఇద్దరి పాత్ర ఉందని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ, స్క్రీన్ ప్లే అందించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం కంగనా రనౌత్ అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలలో కూడా నటించింది. వార్ నేపథ్యం ఉన్న చిత్రం కావడంతో కంగనా పలు కష్టసాధ్యమైన స్టంట్స్ చేసినట్లు తెలుస్తోంది. షూటింగ్ లో కంగనా గాయాలు ఎదుర్కొంది కూడా.