Don't Miss!
- News Atchannaidu: అచ్చెన్నాయుడికి ఎన్నికల వేళ హైకోర్టులో భారీ ఊరట..!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
కంగన రనౌత్ ఇళ్లు కూల్చివేత.. మహారాష్ట్ర సర్కార్.. వారి గుండాల ప్రతీకార చర్య అంటూ..
బాలీవుడ్ నటి కంగన రనౌత్ ముంబైకి వస్తున్న క్రమంలో మహారాష్ట్ర సర్కార్ ఆమెపై ప్రతీకార చర్యకు పాల్పడింది. కొద్ది రోజుల క్రితం ముంబై పాక్ ఆక్రమిత కశ్మీర్గా, తాలిబాన్ దేశంగా మారిందంటూ కంగన తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. దాంతో కంగనకు జీవించే హక్కు లేదంటూ మహా సర్కార్ మండిపడింది. ఈ క్రమంలో కంగనపై పలు కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల్లో భాగంగా ఇంటిని కూల్చివేతకు బొంబాయి మున్సిపల్ అధికారులు సిద్ధమైన సమయంలో కంగన చేసిన సంచలన వ్యాఖ్యలు ఏమిటంటే...
కంగన ఇంటిని కూల్చివేస్తున్న బీఎంసీ
బీఎంసీ నిబంధనలకు విరుద్ధంగా కంగన రనౌత్ ఇంటిని నిర్మించుకొన్నదనే ఆరోపణలపై ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఆమె ముంబైకి వస్తున్న క్రమంలోనే ఇంటిలోకి దూరి బీఎంసీ సిబ్బంది కూల్చివేతకు పాల్పడ్డారు. ఈ క్రమంలో మరోసారి ముంబై పాక్ ఆక్రమిత కశ్మీర్గా మారిందంటూ వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్ర సర్కార్, వారి గుండాలు
ముంబై నగరాన్ని దర్శించుకొనేందుకు ఎయిర్పోర్టుకు వెళ్తున్నాను. ఆ సమయంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం, వారి గుండాలు నా ఇంటిని అక్రమంగా కూల్చి వేస్తున్నారు. మీ పని మీరు చేసుకొండి. మహారాష్ట్ర ప్రతిష్టను పెంచడానికి రక్తాన్ని ధారపోయడానికైనా సిద్ధం. ఇలాంటి చర్యల వల్లే మహారాష్ట్ర, ముంబై నాకు స్ఫూర్తిని పెంచుతుంది అని కంగన ట్వీట్ చేశారు.
నిజంగా ముంబైలో పీవోకే..
తన ఇంటిని కూల్చివేస్తున్న ఫోటోలను ట్వీట్ చేసిన కంగన స్పందిస్తూ.. నేను ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు. ముంబై పాక్ ఆక్రమిత కశ్మీర్ అని నేను అంటే దానిని నా శతృవులు రుజువు చేస్తున్నారు. అందుకు నిదర్శనం మహారాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ఇదే అంటూ ఫోటోను షేర్ చేసి ట్వీట్ చేశారు.
ప్రజాస్వామ్యం ఖూనీ అయిందంటూ..
తన ఇంటిని కూల్చివేయడంపై కంగన రనౌత్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యం నిట్టనిలువునా ఖూనీ అయింది. ముంబైలో పాకిస్థాన్ తరహా రాజ్యం ఏలుతున్నది. అందుకు సాక్ష్యం బీఎంసీ అధికారులు నా ఇంటిని కూల్చివేయడమే అంటూ కంగన మరో ఫోటోను ట్వీట్ చేశారు. నా ఇంటిలో అక్రమ కట్టడాలు లేవు. కోవిడ్ సమయంలో కూల్చివేతలను బ్యాన్ చేశారు. ఇలా నాపై మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతీకారం తీర్చుకొంటున్నది అంటూ కంగన ట్వీట్ చేశారు.
Recommended Video
ముంబైకి చేరుకొంటున్న కంగన రనౌత్
లాక్డౌన్లో తన సొంత పట్టణం మనాలిలో ఉంటున్న కంగన రనౌత్ తాజా వివాదాల మధ్య ముంబైకి చేరుకొంటున్నారు. మనాలి నుంచి నేరుగా ఫ్లయిట్ లేకపోవడంతో ఆమె చండీగఢ్ చేరుకొని అక్కడి నుంచి ముంబైకి ఫ్లయిట్లో రానున్నారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల కల్లా ఆమె ముంబైకి చేరుకొంటారనేది తాజా సమాచారం.