Don't Miss!
- News ఘర్ వాపసీ: రేవంత్ రెడ్డిని కలిసిన కేకే, కేసీఆర్ గౌరవం ఇచ్చారు కానీ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
తల్లిని బయటే ఉండమన్నాడు.. పిల్లను రేప్ చేశాడు.. కంగనా కామెంట్స్ వైరల్
ప్రస్తుతం బాలీవుడ్, అందులోని చీకటి కోణాలు, డ్రగ్స్ భూతం జాతీయ స్థాయిలో చర్చకు వస్తోంది. ఎక్కడి సుశాంత్ కేసు.. ఎక్కడి డ్రగ్స్ కేసు.. ఎక్కడి దీపికా పదుకొణె. ఇలా సుశాంత్ కేసు నుంచి మొదలైన ఈ రచ్చ.. మెల్లి మెల్లిగా డ్రగ్స్ కోరల్లో చిక్కుకుంది. మొదటగా రియా చక్రవర్తిని అరెస్ట్ చేశారు. ఆపై మెల్లిమెల్లిగా టాప్ సెలెబ్రిటీల పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నేడు దేశ వ్యాప్తంగా దీపికా పదుకొణె, క్వాన్ టాలెంట్ మేనేజ్మెంట్ ఉద్యోగి కరిష్మా బండారం బయట పడింది.
వాట్సప్ చాట్ లీక్..
D, K అనే ఇద్దరి మధ్యలో ‘మాల్' ఉందా అంటూ జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అందులో డీ అంటే దీపికా అని, కే అంటే క్వాన్ టాలెంట్ మేనేజ్మెంట్ ఉద్యోగి కరిష్మా అని తేలింది. దీంతో మాల్ హై క్యా అంటూ నెటిజన్లు దీపికను తెగ ట్రోల్ చేస్తున్నారు.
క్వాన్ ఓనర్ను సైతం..
అయితే ఈ వ్యవహారంలో క్వాన్ టాలెంట్ మేనేజ్మెంట్ హస్తం కూడా ఉంటుందన్న అనుమానంతో ఎన్సీబీ అధికారులు దీనిపై కూడా ఓ కన్నేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆ సంస్థ యజమానులకు సమన్లు జారీ చేయబోతోన్న జాతీయ మీడియా వెల్లడించింది. ఇక ఈ విషయంలో కంగనా ఎంట్రీ ఇచ్చింది.
ఎంతో మంది అమ్మాయిలను..
క్వాన్ సంస్థ సహ యజమాని అనిర్బన్ బ్లా భాగోతాన్ని కంగనా బయటపెట్టింది. గతంలో అతనిపై అత్యాచార ఆరోపణలు వచ్చాయని కంగనా పేర్కొంది. ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడని తెలిపింది. అందులో ఓ అమ్మాయి తన అమ్మతో కలిసి ఆయన్ను మీట్ అయ్యేందుకు వెళ్లింది అంటూ నాటి గతాన్ని తవ్వింది.
Recommended Video
తల్లిని బయటే ఉండమని..
అయితే ఆ సమయంలో ఆ తల్లిని బయటే కూర్చొని ఎదురుచూడమని చెప్పి, ఆ అమ్మాయిని లోపలికి తీసుకెళ్లి అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడని తెలిపింది. ఆ తల్లి ఫిర్యాదు కూడా చేసింది. మీడియా కూడా వార్తలు రాసింది.. కానీ మళ్లీ కొన్నిరోజులు తరువాత అందరూ మాయమైపోయారని కంగనా ట్వీట్ చేసింది.