Don't Miss!
- News YS Sharmila: వైఎస్ షర్మిలకు ఈసీ షాక్- వివేకా కేసులో వ్యాఖ్యలకు నోటీసులు..!
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తల్లిని బయటే ఉండమన్నాడు.. పిల్లను రేప్ చేశాడు.. కంగనా కామెంట్స్ వైరల్
ప్రస్తుతం బాలీవుడ్, అందులోని చీకటి కోణాలు, డ్రగ్స్ భూతం జాతీయ స్థాయిలో చర్చకు వస్తోంది. ఎక్కడి సుశాంత్ కేసు.. ఎక్కడి డ్రగ్స్ కేసు.. ఎక్కడి దీపికా పదుకొణె. ఇలా సుశాంత్ కేసు నుంచి మొదలైన ఈ రచ్చ.. మెల్లి మెల్లిగా డ్రగ్స్ కోరల్లో చిక్కుకుంది. మొదటగా రియా చక్రవర్తిని అరెస్ట్ చేశారు. ఆపై మెల్లిమెల్లిగా టాప్ సెలెబ్రిటీల పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నేడు దేశ వ్యాప్తంగా దీపికా పదుకొణె, క్వాన్ టాలెంట్ మేనేజ్మెంట్ ఉద్యోగి కరిష్మా బండారం బయట పడింది.
వాట్సప్ చాట్ లీక్..
D, K అనే ఇద్దరి మధ్యలో ‘మాల్' ఉందా అంటూ జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అందులో డీ అంటే దీపికా అని, కే అంటే క్వాన్ టాలెంట్ మేనేజ్మెంట్ ఉద్యోగి కరిష్మా అని తేలింది. దీంతో మాల్ హై క్యా అంటూ నెటిజన్లు దీపికను తెగ ట్రోల్ చేస్తున్నారు.
క్వాన్ ఓనర్ను సైతం..
అయితే ఈ వ్యవహారంలో క్వాన్ టాలెంట్ మేనేజ్మెంట్ హస్తం కూడా ఉంటుందన్న అనుమానంతో ఎన్సీబీ అధికారులు దీనిపై కూడా ఓ కన్నేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆ సంస్థ యజమానులకు సమన్లు జారీ చేయబోతోన్న జాతీయ మీడియా వెల్లడించింది. ఇక ఈ విషయంలో కంగనా ఎంట్రీ ఇచ్చింది.
ఎంతో మంది అమ్మాయిలను..
క్వాన్ సంస్థ సహ యజమాని అనిర్బన్ బ్లా భాగోతాన్ని కంగనా బయటపెట్టింది. గతంలో అతనిపై అత్యాచార ఆరోపణలు వచ్చాయని కంగనా పేర్కొంది. ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడని తెలిపింది. అందులో ఓ అమ్మాయి తన అమ్మతో కలిసి ఆయన్ను మీట్ అయ్యేందుకు వెళ్లింది అంటూ నాటి గతాన్ని తవ్వింది.
Recommended Video
తల్లిని బయటే ఉండమని..
అయితే ఆ సమయంలో ఆ తల్లిని బయటే కూర్చొని ఎదురుచూడమని చెప్పి, ఆ అమ్మాయిని లోపలికి తీసుకెళ్లి అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడని తెలిపింది. ఆ తల్లి ఫిర్యాదు కూడా చేసింది. మీడియా కూడా వార్తలు రాసింది.. కానీ మళ్లీ కొన్నిరోజులు తరువాత అందరూ మాయమైపోయారని కంగనా ట్వీట్ చేసింది.