Don't Miss!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- News న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నేను అలాంటి వారి పక్షాన నిలబడను.. జేఎన్యూ ఘటనపై కంగనా కామెంట్స్
దేశవ్యాప్తంగా దుమారం రేపిన జేఎన్యూ ఘటన సెగలు సెలెబ్రిటీలకు సైతం తాకింది. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సీటీలో కొందరు దుండగులు విద్యార్థులపై దాడికి దిగిన ఈ ఘటనను వ్యతిరేకంగా నిరసనలు చేసిన విద్యార్థుల పక్షాన దీపికా పదుకొణె నిలబడిన సంగతి తెలిసిందే. తన సినిమా ఛపాక్ ప్రమోషన్స్ కోసం ఢిల్లీ వెళ్లిన దీపికా.. అక్కడి విద్యార్థుల నిరసనలో పాల్గొంది. అయితే ఈ కారణంగా ఛపాక్కు నష్టాలు ఏర్పడ్డాయి.
జేఎన్యూ ఘటనలో దీపికా ఎంటర్ కావడంతో ఆమె చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలని బీజేపీ నేతలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున పిలుపునిచ్చాయి. దీంతో సినిమాకు ఆర్థిక నష్టాలు ఏర్పడ్డాయి. ఛపాక్ చిత్రానికి రాజకీయ రంగు పులుముకోవడంతో బాక్సాఫీస్ వద్ద వెలవెలబోయింది. ఇలాంటి ఘటనల్లో ధైర్యంగా నిలబడ్డ దీపికాకు కొందరు మద్దతు పలకగా..మరికొందరు ఆమెను టార్గెట్ చేశారు. కానీ మిగతా సెలెబ్రిటీలు ఎవ్వరూ ఈ ఘటనపై నోరు మెదపలేదు.
తాజాగా జేఎన్యూ ఘటన, దీపికా సందర్శనపై కంగనా రనౌత్ మాట్లాడుతూ.. దీపికా ఏం చేసిందో, ఏం చేస్తే బాగుంటుందో, ఏం చేయాల్సి ఉందో అనే వాటిపై తాను కామెంట్ చేయకూడదని చెప్పుకొచ్చింది. ఎవరికైనా భావప్రకటన స్వేచ్చ, హక్కులున్నాయని తెలిపింది. అయితే దేశాన్ని విభజించాలనుకునే వారి పట్ల, దేశం అంటే ప్రేమ లేని వారు, జవాన్లు చనిపోతే పండుగ చేసుకునేవారి పక్షాన నిలబడనని తేల్చి చెప్పింది. నేనేం చేయాలనుకుంటానే చెప్పగలను కానీ ఆమె చేసి ఉండాల్సిందో అనేవాటి గురించి చెప్పలేనని పేర్కొంది. ఛపాక్ సినిమాపై బాయ్ కాట్ ప్రకటించడంపై మాట్లాడుతూ.. మంచి సినిమాను ఎవ్వరూ ఆపలేరని, ఎవరో బాయ్ కాట్ చేసినంత మాత్రాన ఏమి జరగదని చెప్పుకొచ్చింది. కంగనా ప్రధాన పాత్రలో నటించిన పంగా చిత్రం జనవరి 24న విడుదల కానుంది.