Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఇండియా పేరును భారత్గా మార్చాలి.. ఆ బానిసత్వం మనకొద్దు.. కంగన రనౌత్ డిమాండ్
బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ మరోసారి సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా పేరును భారత్గా మార్చాలంటే తన పోస్టులో పేర్కొన్నారు. తన పోస్టులో కంగన స్పందిస్తూ... ప్రాచీన అధ్యాత్మికత, మేధస్సు ద్వారానే ఇండియా వృద్ది పథంలో ప్రయాణిస్తున్నాను. అందుకే ప్రాచీన మూలాలే కారణం. వేదాలు, గీత, యోగా లాంటి మూలాలపై ప్రపంచం దృష్టి సారించింది. నాగరికత పేరుతో పట్టణాల్లో పాశ్చత్య ధోరణలు పెరిగిపోతున్నాయి. అలాంటి వాటికి చెక్ పెడితే భారత్ ప్రపంచాన్ని శాసించే లీడర్గా ఎదుగుతుందనే అభిప్రాయం కలుగుతున్నది. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఇండియా పేరును తిరిగి భారత్ అని మార్చాలన్నది నా అభిప్రాయం. బ్రిటీష్ వాళ్లు ఇచ్చిన బానిస్వత్వంగా ఇచ్చిన ఇండియా పేరును భారత్గా మార్చాల్సిందే అని కంగన రనౌత్ కూ యాప్లో పేర్కొన్నారు.
కంగన తన పోస్టులో మరిన్ని వివరాలు ఇస్తూ. ఇండియా అనేది బ్రిటీష్ ఇచ్చిన బానిస పేరు. దాని అర్ధం తూర్పులో ఉండే హిందూ రివర్. దాని సీ సెక్షన్ ద్వరా జన్మించిన అంగవైకల్యం కలిగిన శిశువు మాదిరిగా ఉందా ఆ పేరు. అసలు భారత్ అంటే అసలు అర్ధమేమిటో నేను చెబుతాను. భా అంటే భావం.. ర అంటే రాగం.. త్ అంటే తాళం అని కొత్త అర్ధం చెప్పింది. మనలో భావుకత్వం అంది. మన భాష, సంస్కతి, నాగరికతను ధ్వంసం చేసింది. అందులో భాగంగానే మన ప్రాంతాల పేర్లను కూడా మార్చేసింది. వారసత్వ కట్టడాల పేర్లను కూడా మార్చేసి మన అస్థిత్వాన్ని కూలదోసింది. భారత్ పేరుతో మన మూలాలను, మన ప్రతిష్టను తిరిగి పొందాలి అంటూ సుదీర్ఘమైన లేఖను కంగన రాశారు.
అయితే కంగన రనౌత్ పోస్టుపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కంగన చెప్పినట్టు బానిసత్వంగా వచ్చిన ఇండియా పేరును మార్చాల్సిందే. కానీ బ్రిటీష్ కంటే ముందు ఇండియా లేదా భారత్ అనేది లేదనే విషయాన్ని ఆమెకు ఎవరు చెప్పాలి అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
కంగన కెరీర్ విషయానికి వస్తే... జయలలిత జీవిత కథలోని కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కిన తలైవి చిత్రానికి సెన్సార్ బోర్డు యూ సర్టిఫికెట్ ఇచ్చింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది. అంతేకాకుండా ధాకడ్, తేజాస్, మణికర్ణిక రిటర్న్స్ చిత్రాల్లో నటిస్తున్నారు.