Don't Miss!
- News ఉండి టీడీపీలో వార్ - మారుతున్న లెక్కలు, ఆడియో వైరల్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మాపై కేసు కక్ష పూరితం.. ఎఫ్ఐఆర్ కొట్టివేయండి.. కంగన, రంగోలి పిటిషన్
కంగన రనౌత్, తనపై ముంబై పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని రంగోలి చండేల్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారు. మత సామరస్యతను దెబ్బ తీస్తున్నారంటూ కంగన రనౌత్, ఆమె సోదరి రంగోలి చండేల్పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. దేశ బహిష్కరణ ఆరోపణలపై వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
తమపై దాఖలు చేసిన పిటిషన్ కక్షపూరితం, కాబట్టి దానిని తోసిపుచ్చాలంటూ కంగన రనౌత్, రంగోలి చండేల్ పిటిషన్ దాఖలు చేశారు అని వారి తరఫు న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖి తెలిపారు. పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని, అలాగే వారిని విచారించాలని దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇదిల ఉండగా, 23. 24 తేదీలలో కంగన, రంగోలిని విచారణకు హాజరుకావాలని సమన్లు దాఖలు చేశారు. ఇలా వారికి సమన్లు జారీ చేయడం ఇది మూడోసారి. కంగన రనౌత్, రంగోలి చండేల్పై ఐపీసీ సెక్షన్ 153 ఏ, 295 ఏ, 124 ఏ, 34 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.