Don't Miss!
- Lifestyle ప్రేమ విషయంలో ఈ రాశులను మాత్రం అస్సలు నమ్మకూడదు..నమ్మక ద్రోహం చేస్తారు..
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మాపై కేసు కక్ష పూరితం.. ఎఫ్ఐఆర్ కొట్టివేయండి.. కంగన, రంగోలి పిటిషన్
కంగన రనౌత్, తనపై ముంబై పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని రంగోలి చండేల్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారు. మత సామరస్యతను దెబ్బ తీస్తున్నారంటూ కంగన రనౌత్, ఆమె సోదరి రంగోలి చండేల్పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. దేశ బహిష్కరణ ఆరోపణలపై వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
తమపై దాఖలు చేసిన పిటిషన్ కక్షపూరితం, కాబట్టి దానిని తోసిపుచ్చాలంటూ కంగన రనౌత్, రంగోలి చండేల్ పిటిషన్ దాఖలు చేశారు అని వారి తరఫు న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖి తెలిపారు. పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని, అలాగే వారిని విచారించాలని దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇదిల ఉండగా, 23. 24 తేదీలలో కంగన, రంగోలిని విచారణకు హాజరుకావాలని సమన్లు దాఖలు చేశారు. ఇలా వారికి సమన్లు జారీ చేయడం ఇది మూడోసారి. కంగన రనౌత్, రంగోలి చండేల్పై ఐపీసీ సెక్షన్ 153 ఏ, 295 ఏ, 124 ఏ, 34 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.