Don't Miss!
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మాపై కేసు కక్ష పూరితం.. ఎఫ్ఐఆర్ కొట్టివేయండి.. కంగన, రంగోలి పిటిషన్
కంగన రనౌత్, తనపై ముంబై పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని రంగోలి చండేల్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారు. మత సామరస్యతను దెబ్బ తీస్తున్నారంటూ కంగన రనౌత్, ఆమె సోదరి రంగోలి చండేల్పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. దేశ బహిష్కరణ ఆరోపణలపై వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
తమపై దాఖలు చేసిన పిటిషన్ కక్షపూరితం, కాబట్టి దానిని తోసిపుచ్చాలంటూ కంగన రనౌత్, రంగోలి చండేల్ పిటిషన్ దాఖలు చేశారు అని వారి తరఫు న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖి తెలిపారు. పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని, అలాగే వారిని విచారించాలని దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇదిల ఉండగా, 23. 24 తేదీలలో కంగన, రంగోలిని విచారణకు హాజరుకావాలని సమన్లు దాఖలు చేశారు. ఇలా వారికి సమన్లు జారీ చేయడం ఇది మూడోసారి. కంగన రనౌత్, రంగోలి చండేల్పై ఐపీసీ సెక్షన్ 153 ఏ, 295 ఏ, 124 ఏ, 34 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.