Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మాపై కేసు కక్ష పూరితం.. ఎఫ్ఐఆర్ కొట్టివేయండి.. కంగన, రంగోలి పిటిషన్
కంగన రనౌత్, తనపై ముంబై పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని రంగోలి చండేల్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారు. మత సామరస్యతను దెబ్బ తీస్తున్నారంటూ కంగన రనౌత్, ఆమె సోదరి రంగోలి చండేల్పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. దేశ బహిష్కరణ ఆరోపణలపై వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
తమపై దాఖలు చేసిన పిటిషన్ కక్షపూరితం, కాబట్టి దానిని తోసిపుచ్చాలంటూ కంగన రనౌత్, రంగోలి చండేల్ పిటిషన్ దాఖలు చేశారు అని వారి తరఫు న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖి తెలిపారు. పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని, అలాగే వారిని విచారించాలని దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇదిల ఉండగా, 23. 24 తేదీలలో కంగన, రంగోలిని విచారణకు హాజరుకావాలని సమన్లు దాఖలు చేశారు. ఇలా వారికి సమన్లు జారీ చేయడం ఇది మూడోసారి. కంగన రనౌత్, రంగోలి చండేల్పై ఐపీసీ సెక్షన్ 153 ఏ, 295 ఏ, 124 ఏ, 34 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.