Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రైతు ఉద్యమంపై పాప్ సింగర్ ట్వీట్: దేశాన్ని ముక్కలు చేస్తున్నారంటూ కంగనా ఘాటు కౌంటర్
కంగనా రనౌత్.. కొన్నేళ్లుగా దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోన్న పేరిది. నటిగా ఎన్నో సినిమాల్లో నటించినా దక్కని గుర్తింపు.. పలు వివాదాల్లో భాగం అవడం వల్ల ఆమె సొంతం అయింది. తరచూ ఏదో ఒక అంశంలో తలదూర్చుతూ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోందీ బ్యూటీ. ప్రతి విషయంలోనూ తనదైన రీతిలో స్పందిస్తూ ఉండే ఈమె.. సోషల్ మీడియా వేదికపై ఎంతో మందిపై విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టింది. ఈ కారణంగానే దేశ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా పాప్ సింగర్కు ఘాటుగా కౌంటర్ ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచింది కంగనా.
వ్యవసాయ నూతన చట్టాలను వ్యతిరేకిస్తూ కొద్ది రోజులుగా ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు రైతులు. దీనిపై ప్రముఖ న్యూస్ వెబ్సైట్ సీఎన్ఎన్ ఓ స్టోరీని రాసుకొచ్చింది. దీన్ని ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన బార్బడోస్ పాప్ సింగర్ రిహానా.. 'దీని గురించి మనం ఎందుకు మాట్లాడడం లేదు' అంటూ ఓ క్యాప్షన్ జోడించింది. వంద మిలియన్ల ఫాలోవర్లు ఉన్న ఆమె ట్వీట్ చేయడంతో.. ఈ న్యూస్ ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. దీంతో ఈ ట్వీట్పై చాలా మంది భారతీయులు తమదైన శైలిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్.. రిహానా చేసిన ట్వీట్కు ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. ఈ మేరకు తన ట్విట్టర్లో 'అసలు ఉద్యమంలో పాల్గొనేది రైతులే కాదు. మా దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటోన్న ఉగ్రవాదులే ఇలా చేస్తున్నారు. వాళ్లంతా మా దేశాన్ని చైనా కాలనీగా మార్చాలనుకుంటున్నారు. మీలా మేము మా దేశాన్ని అమ్ముకోవాలనుకోవడం లేదు. అందుకే దీనిపై ఎవరూ మాట్లాడరు' అంటూ రాసుకొచ్చిందామె. ఇక, ఉద్యమం చేస్తున్న రైతుల పట్ల కంగనా చేసిన ఈ ట్వీట్పై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.