Don't Miss!
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- News Atchannaidu: అచ్చెన్నాయుడికి ఎన్నికల వేళ హైకోర్టులో భారీ ఊరట..!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
కంగన డ్రీమ్ ప్రాజెక్ట్స్: ఆ ఇద్దరు హీరోలతో.. అలాంటి రీమేక్స్లో..
బాలీవుడ్లో విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొంటున్న కంగన రనౌత్ బాలీవుడ్లో అమీర్ ఖాన్, రణ్బీర్ కపూర్, రణ్వీర్ సింగ్తో నటించాలనే కోరికను బయటపెట్టారు. బాలీవుడ్ క్లాసిక్ అభిమాన్ లాంటి చిత్రంలో రణ్బీర్ కపూర్తో కలిసి నటించాలని ఉందని ఆమె చెప్పారు. సినీ పరిశ్రమలో ఓ గొప్ప నటి అనే ముద్ర పడే చిత్రంలో నటించేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు.
ఇక అమీర్ ఖాన్తో కూడా నటించాలని ఉందని, లెజెండ్స్ దిలీప్ కుమార్, మధుబాల కలిసి నటించిన ఓ లవ్ స్టోరీలో ఏదైనా ఒక సినిమా రీమేక్ చేస్తే నటించాలని ఉందని కంగన మనసులో మాట చెప్పింది.
ప్రఖ్యాత గాయకుడు కిషోర్ కుమార్ బయోపిక్లో మధుబాల పాత్రను చేసే అవకాశం వచ్చింది. దర్శకుడు అనురాగ్ బసు నాకు ఆ ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమా సెట్స్పైకి రాకుండానే ఆగిపోయింది. మళ్లీ అలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను అని కంగన చెప్పారు.
ప్రస్తుతం కబడ్డీ క్రీడా ఆధారంగా ఆశ్వినీ అయ్యర్ తివారీ రూపొందిస్తున్న పంగా చిత్రంలో కంగన రనౌత్ నటిస్తున్నది. అలాగే జయలలిత జీవితం ఆధారంగా రూపొందుతున్న తలైవి చిత్రంలోనూ, ధాకడ్ అనే హిందీ చిత్రాల్లో కీలక పాత్రలను పోషిస్తున్నారు.