Don't Miss!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- News చంద్రబాబు , భువనేశ్వరి ఆస్తుల్లో భారీ పెరుగుదల - 5 ఏళ్ల కాలంలోనే..!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కంగన డ్రీమ్ ప్రాజెక్ట్స్: ఆ ఇద్దరు హీరోలతో.. అలాంటి రీమేక్స్లో..
బాలీవుడ్లో విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొంటున్న కంగన రనౌత్ బాలీవుడ్లో అమీర్ ఖాన్, రణ్బీర్ కపూర్, రణ్వీర్ సింగ్తో నటించాలనే కోరికను బయటపెట్టారు. బాలీవుడ్ క్లాసిక్ అభిమాన్ లాంటి చిత్రంలో రణ్బీర్ కపూర్తో కలిసి నటించాలని ఉందని ఆమె చెప్పారు. సినీ పరిశ్రమలో ఓ గొప్ప నటి అనే ముద్ర పడే చిత్రంలో నటించేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు.
ఇక అమీర్ ఖాన్తో కూడా నటించాలని ఉందని, లెజెండ్స్ దిలీప్ కుమార్, మధుబాల కలిసి నటించిన ఓ లవ్ స్టోరీలో ఏదైనా ఒక సినిమా రీమేక్ చేస్తే నటించాలని ఉందని కంగన మనసులో మాట చెప్పింది.
ప్రఖ్యాత గాయకుడు కిషోర్ కుమార్ బయోపిక్లో మధుబాల పాత్రను చేసే అవకాశం వచ్చింది. దర్శకుడు అనురాగ్ బసు నాకు ఆ ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమా సెట్స్పైకి రాకుండానే ఆగిపోయింది. మళ్లీ అలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను అని కంగన చెప్పారు.
ప్రస్తుతం కబడ్డీ క్రీడా ఆధారంగా ఆశ్వినీ అయ్యర్ తివారీ రూపొందిస్తున్న పంగా చిత్రంలో కంగన రనౌత్ నటిస్తున్నది. అలాగే జయలలిత జీవితం ఆధారంగా రూపొందుతున్న తలైవి చిత్రంలోనూ, ధాకడ్ అనే హిందీ చిత్రాల్లో కీలక పాత్రలను పోషిస్తున్నారు.