Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఇక నీ అంతు చూస్తా.. నీ పని అయిపోయింది.. కంగనాకు ఆదిత్య చోప్రా బెదిరింపులు
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తరువాత నెపోటిజంపై ఎక్కువగా చర్చలు వినిపిస్తున్నాయి. అయితే అంతకు పూర్వమే బాలీవుడ్ మాఫియా, బంధుప్రీతిల గురించి గొంతు చించుకుని మొత్తుకుంది కంగనా రనౌత్. కానీ కంగనాను ఏనాడూ ఎవ్వరూ సీరియస్గా తీసుకోలేదు. కానీ సుశాంత్ మరణం తరువాత కంగనా మాటలే నిజమని అందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు. అయితే తాజాగా ఓ జాతీయా మీడియాతో మాట్లాడుతూ నెపోటిజం గురించి చెబుతూ.. బాలీవుడ్ పెద్దల గుట్టు విప్పింది.
అలా చేశారు..
తను వెడ్స్ మను వంటి భారీ హిట్ వచ్చాక తాను స్టార్గా మారిపోయానని, వెంటనే 19 బ్రాండ్ కంపెనీలు యాడ్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నారని కంగనా చెప్పుకొచ్చింది. అయితే అదే సమయంలో 2103లో బ్రేకప్ జరిగిన విషయాన్ని మళ్లీ బయటకు తీసి తనపై ఫిర్యాదు చేసి తన పేరును చెడగొట్టారని, దాంతో ఆ కాంట్రాక్ట్లన్నీ రద్దయ్యానని తెలిపింది. అలా తనను ఎంతో హింసించారని చెప్పుకొచ్చింది.
సుల్తాన్ సినిమాను..
సుల్తాన్ సినిమాలో నటించమని తనను ఆదిత్య చోప్రా కోరారని కానీ తాను అంగీకరించలేదని తెలిపింది. మొదటగా వారి మేనేజర్ వచ్చి సుల్తాన్ స్క్రిప్ట్ చెప్పారని, అయితే తాను ఖాన్లతో సినిమాలు చేయనని, ఆ ఆఫర్ను తిరస్కరించానని చెప్పుకొచ్చింది.
మీడియాలో వచ్చింది..
అయితే ఇదే విషయమై మీడియా అడిగినప్పుడు సుల్తాన్ సినిమా ఆఫర్కు నో చెప్పానని తెలిపింది. అయితే ఆ విషయాన్ని చూసిన ఆదిత్య చోప్రా తెగ ఆవేశపడ్డాడని తెలిపింది. దాంతో తనను చాలా రకాలుగా బెదిరించారని, అంతు చూస్తానని మెసెజ్ కూడా చేశారని కంగనా పేర్కొంది.
Recommended Video
నీ పని అయిపోయింది..
యూ ఆర్ ఫినిషిడ్.. అంటూ ఆదిత్యా చోప్రా ఆగ్రహంతో తనకు మెసెజ్లు చేశాడని, బెదిరించాడని కంగనా తాజాగా వెల్లడించింది. తన సినిమానే కాదంటావా? అంటూ తనమీద పగబట్టాడని కంగనా పేర్కొంది. సుశాంత్ను సైతం అలాగే కావాలనే తొక్కేశారని, చివరకు మరణించేవరకు వదిలపెట్టలేదని చెప్పుకొచ్చింది.