Don't Miss!
- Automobiles టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Finance EPFO News: ఉద్యోగులకు గుడ్న్యూస్.. మారిన పీఎఫ్ విత్డ్రా రూల్స్.. ఎంతంటే..??
- News YS Jagan: జగన్ పై దాడి కేసులో ఇద్దరి అరెస్ట్-కాసేపట్లో కోర్టుకు..!
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
- Sports IPL 2024: అంబానీ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
ఆంగ్లేయులు మళ్లీ దోచుకొన్నారు.. ప్రియాంక చోప్రా పెళ్లిపై హాట్ కామెంట్
హిందీ టెలివిజన్ రంగంలో ది కపిల్ శర్మ షో నిర్వహించే టాప్ కమెడియన్ కపిల్ శర్మ పంచ్లు వేయడంలో దిట్ట అనే సంగతిని కొత్తగా చెప్పనక్కర్లేదు. ఈ షోలో పాల్గొనే వారిని నవ్వుల్లో ముంచెత్తడం సర్వసాధారణం. ఈ పాపులర్ షోకు తాజాగా బాలీవుడ్ తారలు పరిణితి చోప్రా, సిద్ధార్థ్ మల్హోత్రాలు హాజరయ్యారు. వీరిద్దరు త్వరలో రిలీజ్ కాబోయే జబరియా జోడి సినిమా ప్రమోషన్ కోసం ది కపిల్ శర్మ షోలో పాల్గొన్నారు. కాగా ప్రముఖ నటి ప్రియాంక చోప్రాకు పరిణితి చోప్రా సోదరి అనే విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రియాంక పెళ్లిని ఉద్దేశించి కపిల్ శర్మ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
గతంలో భారత దేశాన్ని ఆంగ్లేయులు దోచుకువెళ్లిన సంగతి తెలిసిందే. వారిని సుదీర్ఘమైన పోరాటం తర్వాత దేశం నుంచి వెళ్లగొట్టిన విషయం విధితమే. తాజాగా మరోసారి ఆంగ్లేయులు దోపిడికి పాల్పడ్డారని పరిణితిని ఉద్దేశించి కపిల్ శర్మ అన్నారు.
అయితే కపిల్ శర్మ చేసిన వ్యాఖ్యలు సరిగా వెలుగలేదు. దాంతో ప్రియాంకను నిక్ జోనస్ పెళ్లి చేసుకోవడం ద్వారా ఆంగ్లేయులు ప్రియాంక అందాల సంపదను మరోసారి దోపిడికి పాల్పడ్డారని అనడంతో పరిణితి చోప్రా పడిపడి నవ్వింది. జబరియా జోడి సినిమా ప్రమోషన్లో పరిణితి, సిద్ధార్థ్ బిజీగా ఉన్నారు. బీహార్లో పెళ్లి కొడుకును ఎత్తుకెళ్లే అంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు.