Don't Miss!
- News ఏడాది పొడవునా శశ రాజయోగం.. ఈ రాశులకు డబ్బే డబ్బు
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
కరణ్ జోహార్ సీరియస్ .. ఒకేసారి 14 మంది దర్శకులతో కొత్త సినిమాలు
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అగ్ర దర్శక నిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహార్ గత కొంతకాలంగా విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా నెపోటిజమ్ విమర్శలతో ఆయన ఇటీవల చాలానే ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం అనంతరం కరణ్ జోహార్ సినిమాలపై కూడా నిత్యం విమర్శలు వస్తూనే ఉన్నాయి.
ఆయన తన ధర్మ ప్రొడక్షన్ లో నిత్యం స్టార్స్ పిల్లలకి మాత్రమే అవకశాలు ఇస్తారని కొత్తవాళ్లకు ఏ మాత్రం ఛాన్సులు ఇవ్వరని ఎదిగేవాళ్ళను కూడా తొక్కేస్తారని విమర్శించారు. అయితే ఆ విమర్శలకు ఒకే తరహాలో కౌంటర్ ఇవ్వాలని కరణ్ జోహార్ గట్టిగాన్స్ ఫిక్స్ అయినట్లు ఉన్నారు. అందుకే ఒకేసారి 14మంది కొత్త దర్శకులను పరిచయం చేయబోతున్నట్లు ఫొటో షూట్ నిర్వహించి మరి క్లారిటీ ఇచ్చారు.
గతంలో కూడా కరణ్ జోహార్ కొంతమంది న్యూ కమర్స్ కు ఛాన్సులు ఇచ్చారు. కానీ అంతగా పబ్లిసిటీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఏకంగా 14 మంది యువ దర్శకులతో ఒకేసారి సినిమాలను సెట్స్ పైకి తీసికురానున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. చూస్తుంటే కరణ్ జోహార్ ఎదో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ 14 మంది దర్శకులు ఎంతవరకు క్లిక్కవుతారో చూడాలి.