Don't Miss!
- News లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నయనతార వీడియో చూసి..కరణ్ జోహర్ క్లీన్ బోల్డ్.. టెప్టింగ్ ఉందని!
Recommended Video
సౌత్ ఇండియన్ లేడీ సూపర్స్టార్ నయనతార నటించిన కొలమావు కోకిల చిత్రానికి అన్ని వర్గాల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. ఘన విజయం వైపు దూసుకెళ్తున్న నేపథ్యంలో గన్ ఇన్ కాదల్ అనే పేరు ప్రమోషనల్ వీడియోను రూపొందించారు. సినిమాతోపాటు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో నయన్ తన లుక్స్తో ఆకట్టుకొన్నది. ఈ వీడియోపై కరణ్ జోహర్ ట్విట్టర్లో స్పందించారు. ఆయన ఏమన్నారంటే..
గన్ ఇన్ కాదల్ ప్రమోషనల్ వీడియో
కొలమావు కోకిలకు సంబంధించిన గన్ ఇన్ కాదల్ అనే వీడియోకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, దర్శకుడు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. నయనతార గ్యాంగ్స్టర్ మాదిరిగా కనిపించే ఆ వీడియోపై ప్రస్తుతం బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహర్ మనసు పడటం చర్చనీయాంశమైంది.
|
చూడాలని ఉంది ట్వీట్
గన్ ఇన్ కాదల్ వీడియోపై కరణ్ జోహర్ ట్విట్టర్లో ప్రశంసల వర్షం కురిపించారు. నయనతార నటించిన కొలమారు కోకిల చిత్రం గురించి బ్లాక్బస్టర్ టాక్ వినిపిస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ వీడియో ఆకట్టుకొన్నది. అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూడాలనే కోరిక వెంటాడుతున్నది అని కరణ్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
కొలమావు కోకిల కథ ఇదే
కొలమావు కోకిలి విషయానికి వస్తే.. మధ్యతరగతి సాంప్రదాయ కుటుంబానికి చెందిన ఓ యువతి కథే కొలమావు కోకిల. క్యాన్సర్ బారిన పడిన తన తల్లి చిక్సిత కోసం డ్రగ్ డీలర్గా నయనతార మారుతుంది. హాస్య నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు నెల్సన్ దర్శకత్వం వహించారు.
బాహుబలి లాంటి చిత్రంతో
ఇదిలా ఉండగా ప్రస్తుతం కరణ్ జోహర్ నిర్మాతగానే కాకుండా దర్శకుడిగా, హోస్ట్గా బిజీగా ఉన్నారు. కాఫీ విత్ కరణ్ షోలో కంగన రనౌత్తో ముచ్చటించారు. అలాగే రణ్వీర్ సింగ్, కరీనా కపూర్, అలియా భట్, జాహ్నవి కపూర్, అనిల్ కపూర్, భూమి పడ్నేకర్ తారలతో బాహుబలి లాంటి చిత్రాన్ని రూపొందించానున్నారు. మొగల్ సామ్రాజ్యం నేపథ్యంగా ఈ చిత్రం రూపొందనున్నది.