Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బాలీవుడ్ బ్యాడ్ టైంకి కారణమదే.. కరణ్ జోహార్ ఓపెన్ కామెంట్స్!
ప్రస్తుతం మిగతా పరిశ్రమలతో పోలిస్తే కనుక బాలీవుడ్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ మధ్య విడుదలైన పృథ్వీరాజ్, జెర్సీ లాంటి మెయిన్ స్ట్రీమ్ సినిమాలు బాగా ఆడతాయి అనుకుంటే అవి అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయితే ఈ ఏడాది విడుదలైన కన్నడ బేస్ ఉన్న కేజిఎఫ్ 2, తెలుగు బేస్ ఉన్న ఆర్ఆర్ఆర్ గత ఏడాది విడుదలైన పుష్ప లాంటి సౌత్ సినిమాలు మాత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అల్లకల్లోలం సృష్టించాయి. తాజాగా ఈ విషయం మీద బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ స్పందించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ 2 చాలా మంచి చిత్రం అని ఆయన కామెంట్ చేశాడు. అయితే అది బాలీవుడ్లో కనుక నిర్మించబడి ఉంటే, విమర్శకులు, రివ్యూయర్లు ఈ సినిమాను తక్కవ చేసి ఉన్నకంటెంట్ను తప్పుపట్టేవారని అన్నారు.
నిజానికి బాలీవుడ్లో విడుదలకు సిద్ధంగా ఉన్న 'జుగ్ జుగ్ జియో', 'బ్రహ్మాస్త్ర'తో పాటు మన పూరీ నిర్మాణ భాగస్వామ్యంతో 'లైగర్'కూ ఆయన నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా సినిమాల ప్రమోషన్స్లో బిజీగా పాల్గొంటున్నకరణ్ ఓ ఇంగ్లీష్ టాబ్లాయిడ్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలోనే ఆయన బాలీవుడ్ నుంచి వస్తోన్న కంటెంట్పై కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ నుంచి ఈ మధ్యకాలంలో సరైన కంటెంట్ రాలేదని ఆయన ఒప్పుకున్నారు. అలా ఒప్పుకుంటూనే ఒకవేళ నిజంగా వచ్చి ఉన్నా రివ్యూయర్లు దాన్ని చీల్చి చెండాడే వారని అన్నారు. సినిమా కోసం కథలను ఎంచుకోవడం, తెరకెక్కించే విషయంలో దక్షిణాది చిత్ర దర్శకులకు ఉన్న నమ్మకం కానీ క్లారిటీ కానీ ఈ మధ్యకాలంలో బాలీవుడ్లో లోపించినట్లు అనిపిస్తోందని అన్నారు.
ఒకే సినిమాలో ఎన్నో అంశాలను చూపించాలనుకుని.. కొన్నిసార్లు బాలీవుడ్ నుంచి మేము విఫలమవుతుంటాము కానీ, దక్షిణాది దర్శకులు.. ఏం చెప్పాలనుకుంటే దాన్ని సరిగ్గా, ప్రేక్షకుడికి చేరువయ్యేలా సినిమాలు రూపొందిస్తున్నారని కొనియాడారు. ఇక కరణ్ చేసిన కామెంట్స్ బాలీవుడ్ బ్యాడ్ టైమ్కి ప్రధాన కారణాన్ని అర్ధమయ్యేలా చెప్పేశాయి. ప్రేక్షకులను పెద్ద సంఖ్యలో థియేటర్లకు రప్పించేలా చేయడానికి అవసరమైన కేజీఎఫ్ 2 వంటి సినిమాలు చేయడం ముఖ్యం అని అర్థం అవుతోంది. సౌత్ మేకర్స్ విమర్శకులను పట్టించుకోని విధంగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించడంలో ప్రావీణ్యం సంపాదించారు. అందుకే దక్షిణాది దర్శకులు పాన్-ఇండియన్ సినిమాలు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిసినిమాలు హిందీ బాక్సాఫీస్ వద్ద కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో విమర్శకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ కూడా ఈ విషయం అర్థం చేసుకుని దానికి అనుగుణంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందన్న మాట.