Don't Miss!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
సైఫ్ అలీఖాన్ ప్రశ్నతో షాకైన కరీనా.. రేడియోలో ఇలా అడుగుతారా!
బాలీవుడ్ స్టార్ కపుల్స్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ మధ్య ఇటీవల ఆసక్తికర సంభాషణ జరిగింది. కరీనా కపూర్ హోస్ట్ గా 'వాట్ వుమెన్ వాంట్' అనే రేడియో షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకు చాలా మంది సెలెబ్రిటీలు అతిథులుగా హాజరవుతున్నారు. జాతీయ స్థాయిలో కరీనా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం బాగా పాపులర్ అవుతోంది. కరీనా కపూర్ ఈ షోలో అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటుంది. షో మధ్యలో కరీనా భర్త సైఫ్ అలీఖాన్ అడిగిన ప్రశ్నకు ఆమె ఆశ్చర్యపోయింది.
రేడియోలో అలాంటి ప్రశ్న
సైఫ్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. పిల్లలు పుట్టాక భార్య, భర్తలు ఒకరికోసం ఒకరు ఎక్కువ సమయం గడపరు. ఇలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు భార్యని మా వైపు ఎలా తిప్పుకోవాలి అని సైఫ్ కరీనాకి ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కరీనా షాక్ అయింది. దీనికి కరీనాకు కూడా అంతే సరదగా స్పందిస్తూ సమాధానం ఇచ్చింది. రేడియోలో ఎవరైనా ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా సైఫ్ అని ప్రశ్నించింది. సరే అడిగింది నువ్వు కాబట్టి సమాధానం ఇస్తాను అని కరీనా తెలిపింది.
అందమైన ప్రదేశానికి
పిల్లలు పుట్టాక కుటుంబంలో భాద్యతలు పెరుగుతాయి. వాటిని భార్య భర్తలు ఇద్దరూ సమానంగా పంచుకోవాలి. అలాంటి సమయంలో కూడా భర్త భార్య కోసం సమయం కేటాయించాలి. అప్పుడే ఆమె సంతోషంగా ఉంటుంది. ఇక భార్య దృష్టిని మీ వైపు మళ్ళించుకొవాలి అనుకుంటే ఆమెని ఓ అందమైన ప్రదేశానికి తీసుకెళ్లండి అంటూ బదులిచ్చింది. ఆ సమయంలో కూడా తన బిడ్డతో సమయం గడపాలని ఆమె అనుకుంటే కోపగించుకోకండి. అంత మాత్రమే మీపై ప్రేమ లేనట్లు కాదు. త్వరలోనే నన్ను ఓ అందమైన ప్రదేశానికి తీసుకెళతావని ఆశిస్తున్నట్లు కరీనా సైఫ్ తో చెప్పింది.
బికినీ, బోల్డ్ సీన్స్.. నన్ను కన్విన్స్ చేయాలి అంటున్న స్టార్ హీరో కుమార్తె!
సైఫ్ అలీఖాన్తో వివాహం
సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ 2012లో వివాహం చేసుకున్నారు. వీరి కొడుకు తైమూర్ ప్రస్తుతం సోషల్ మీడియా స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. తైమూర్ ఫోటో కనిపించినా సోషల్ మీడీయాలో వైరల్ అవుతోంది. అంతగా ఈ బుల్లి తైమూర్ క్యూట్ లుక్ నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. తైమూర్ క్రేజ్ చూసి కరీనా కపూర్ స్వయంగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉంటుంది. తైమూర్ ఇంతగా ఎందుకు వైరల్ అవుతున్నాడో తనకు కూడా అర్థం కావడం లేదని తెలిపింది.
వివాహం తర్వాత కూడా
కరీనా కపూర్ వివాహం తర్వాత కూడా నటిగా కొనసాగుతోంది. కరీనా, సోనమ్ కపూర్, స్వరభాస్కర్ నటించిన వీర్ దే వెడ్డింగ్ చిత్రం గత ఏడాది విడుదలై మంచి విజయం సాధించింది. ప్రస్తుతం కరీనా కపూర్ అక్షయ్ కుమార్ సరసన గుడ్ న్యూస్ అనే చిత్రంలో నటిస్తోంది.