Don't Miss!
- News జూన్ 4 ఫలితాలతో ఏపీలో జరగబోయేదేంటి..!!
- Sports Rohit x Hardik: పదేళ్లుగా కెప్టెన్సీ చేశా.. ఎలా గెలవాలో తెలుసు- రోహిత్
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Technology వన్ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మిస్టర్ ఫర్ఫెక్ట్తో కరీనా కపూర్ మూడోసారి.. లండన్ నుంచి రాగానే!
హాలీవుడ్లో ఆస్కార్ అవార్డులందుకొన్న ఫారెస్ట్ గంప్ చిత్రం ఆధారంగా అమీర్ ఖాన్ రూపొందిస్తున్న హిందీ చిత్రం లాల్ సింగ్ చాద్దా సినిమా సెట్స్పైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నది. వయాకామ్ 18 స్టూడియోస్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి సీక్రెట్ సూపర్స్టార్ రూపొందించిన అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు.
లాల్ సింగ్ చాద్ధా సినిమాలో కరీనాకపూర్ ఖాన్ హీరోయిన్గా నటిస్తున్నట్టు వార్తలు విపరీతంగా ప్రచారం అయ్యాయి. ఆ వార్తలపై చిత్ర యూనిట్కు సంబంధించిన కీలక వ్యక్తి స్పందిస్తూ.. స్వాత్రంత్య సమరయోధుడు పాత్రలో నటిస్తున్న అమీర్ ఖాన్ తన పక్కన కరీనా కపూర్ అయితే బాగుంటుందని భావించారు. అంగ్రేజ్ మీడియం సినిమా కోసం ఆమె లండన్లో ఉన్నారు. ముంబైకి రాగానే సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటిస్తారు.
ఒకవేళ కరీనా కపూర్ లాల్ సింగ్ చాద్ధా సినిమాలో నటిస్తే.. అమీర్ ఖాన్తో కలిసి నటించడం మూడోసారి అవుతుంది. గతంలో తలాష్, 3 ఇడియెట్స్ చిత్రాల్లో కలిసి నటించారు. ఈ సందర్బంగా వయకామ్ సీఈవో అజిత్ అంధారే మాట్లాడుతూ.. అమీర్ ఖాన్ సరసన కరీనా కపూర్ నటించడం చాలా హ్యాపీగా ఉంది అని అన్నారు. ఈ చిత్రం 2020 క్రిస్మస్కు సినిమా రిలీజ్ అవుతుంది.