50 డిగ్రీల వేడిలో 30 డ్రస్సులు మార్చా, చాలా కష్టంగా: కరిష్మా కపూర్
బాలీవుడ్లో 90వ దశకంలో అందాల తార కరిష్మా కపూర్ అగ్రతారగా గ్లామర్తోనూ, ఫెర్ఫార్మెన్స్తోనూ హడలెత్తించింది. తాజాగా టీవీ షోలో పాల్గొన్న కరిష్మా కపూర్ గతంలోకి వెళ్లి తన మధురు క్షణాలను మీడియాతో పంచుకొన్నది. కృష్ణ అనే సినిమా కోసం చోటుచేసుకొన్న ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది.
కృష్ణ అనే సినిమా కోసం ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఫీమేల్, మేల్ వెర్షన్లో పాటను చిత్రీకరించాలి. ఆ పాటను ఓ ఎడారిలో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో షూట్ చేస్తున్నారు. ఫీమెల్ వెర్షన్ను మూడు రోజులపాటు ముంబైలో షూట్ చేశారు. ఎడారిలో మరికొంత భాగాన్ని షూట్ చేశారు. ఆ సమయంలో వేడిగాలితోపాటు కళ్లలో ఇసుక రేణువులు కూడా పడి బాధపట్టే సమయంలో కూడా పాటను షూట్ చేశాం. ఆ పాట కోసం 30 సార్లు డ్రస్సులు మార్చుకొన్నాను అని కరిష్మా చెప్పారు.

30 సార్లు డ్రస్సులు మార్చుకోవడమే కాకుండా అన్నిసార్లు మేకప్ కూడా చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. వాతావరణం ప్రతికూలంగా ఉండే స్థితిని ఎదురించి షూట్ చేయడం మరిచిపోలేని విషయం. అందుకే కృష్ణ చిత్రంలోని ఝాంఝరిగాయ అనే పాట నా కెరీర్లో ఎప్పడూ గుర్తిండిపోతుంది అని కరిష్మా కపూర్ చెప్పారు.


Click it and Unblock the Notifications











