Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
50 డిగ్రీల వేడిలో 30 డ్రస్సులు మార్చా, చాలా కష్టంగా: కరిష్మా కపూర్
బాలీవుడ్లో 90వ దశకంలో అందాల తార కరిష్మా కపూర్ అగ్రతారగా గ్లామర్తోనూ, ఫెర్ఫార్మెన్స్తోనూ హడలెత్తించింది. తాజాగా టీవీ షోలో పాల్గొన్న కరిష్మా కపూర్ గతంలోకి వెళ్లి తన మధురు క్షణాలను మీడియాతో పంచుకొన్నది. కృష్ణ అనే సినిమా కోసం చోటుచేసుకొన్న ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది.
కృష్ణ అనే సినిమా కోసం ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఫీమేల్, మేల్ వెర్షన్లో పాటను చిత్రీకరించాలి. ఆ పాటను ఓ ఎడారిలో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో షూట్ చేస్తున్నారు. ఫీమెల్ వెర్షన్ను మూడు రోజులపాటు ముంబైలో షూట్ చేశారు. ఎడారిలో మరికొంత భాగాన్ని షూట్ చేశారు. ఆ సమయంలో వేడిగాలితోపాటు కళ్లలో ఇసుక రేణువులు కూడా పడి బాధపట్టే సమయంలో కూడా పాటను షూట్ చేశాం. ఆ పాట కోసం 30 సార్లు డ్రస్సులు మార్చుకొన్నాను అని కరిష్మా చెప్పారు.
30 సార్లు డ్రస్సులు మార్చుకోవడమే కాకుండా అన్నిసార్లు మేకప్ కూడా చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. వాతావరణం ప్రతికూలంగా ఉండే స్థితిని ఎదురించి షూట్ చేయడం మరిచిపోలేని విషయం. అందుకే కృష్ణ చిత్రంలోని ఝాంఝరిగాయ అనే పాట నా కెరీర్లో ఎప్పడూ గుర్తిండిపోతుంది అని కరిష్మా కపూర్ చెప్పారు.