Don't Miss!
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- News తనపై ఉన్న కేసుల వివరాలను వెల్లడించిన సీఎం జగన్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కపూర్ ఖాందాన్ ఫోటో వైరల్.. రిషి కపూర్ ఇకలేరంటూ కర్మిషా ఎమోషనల్
బాలీవుడ్ లెజెండ్ రాజ్కపూర్కు నిజమైన వారసుడు రిషి కపూర్ శాశ్వత నిద్రలోకి జారుకొన్నారు. గత రెండేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రిషి కపూర్ గురువారం (ఏప్రిల్ 30వ తేదీన) మరణించడం అభిమానులను, సినీ లోకాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఆయన నటనతో, వ్యక్తిగతంగా అనుబంధమున్న ప్రతీ ఒక్కరు విషాదంలో కూరుకుపోయారు. ఇక కుటుంబ సభ్యుల పరిస్థితి గురించి చెప్పాల్సిన పనేలేదు. రిషి మరణం నుంచి కరీనా, కరిష్మా కపూర్ జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా కపూర్ ఖాందాన్ అంతా కలిసి తీయించుకొన్న ఫోటోను కరిష్మా కపూర్ షేర్ చేశారు. ఈ ఫోటోలో నీతూ కపూర్, రణ్ధీర్ కపూర్, బిబితా, కరీనా కపూర్ ఖాన్, సైఫ్ ఆలీ ఖాన్, కరిష్మా, రిషి కపూర్ ఉన్నారు.
తన తండ్రి రణ్ధీర్ కపూర్ బర్త్ డే సందర్భంగా కపూర్ ఖాందాన్ అంతా సంతోషంలో మునిగిపోయిన సందర్భంగా తీసిన ఫోటోను కరిష్మా కపూర్ షేర్ చేసి భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఫోటోలో రిషి కపూర్ చెక్స్ షర్ట్లో ఉన్నారు. ఆయన ఈ సందర్భంగా మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నట్టు చేతిలో గ్లాస్ చెప్పకనే చెప్పింది.
లాక్డౌన్లో ఆంక్షల కారణంగా రిషి కపూర్ అంత్యక్రియలకు కరిష్మా కపూర్ దూరంగా ఉన్నారు. ఆ కారణంగా తన బాబాయ్తో అనుబంధాన్ని కరిష్మా ఈ సందర్బంగా చాటుకొని ఎమోషనల్ అయ్యారు. ముంబైలోని చందన్వాడీ శ్మశాన వాటికలో జరిగిన అంత్యక్రియలకు నీతూ కపూర్, కరీనా, సైఫ్ ఆలీ ఖాన్, రిమాజైన్, ఆర్మాన్ జైన్, ఆదార్ జైన్, అనిల్ అంబానీ, అభిషేక్ బచ్చన్, రోహిత్ ధావన్, ఆలియాభట్, ఆయన్ ముఖర్జీ తదితరులు పాల్గొన్నారు.
రిషి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయిన కూతురు రిద్ధికపూర్ కోసం మొబైల్లో రిషి అంత్యక్రియల కార్యక్రమాన్ని అలియాభట్ షూట్ చేయడం వివాదంగా మారింది. అసలు విషయాన్ని తెలుసుకోలేకపోయిన నెటిజన్లు అలియాను ట్రోల్ చేశారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకోవడంతో ట్రోలింగ్ ఆగిపోయాయి.