Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మతి పోగొడుతున్న కత్రినా కైఫ్.. వైరల్ అవుతున్న బికినీ అందాలు!
మెరుపుతీగలాంటి అందంతో అభిమానులని ఎప్పటికప్పుడు అలరిస్తున్న కత్రినా కైఫ్ మరో మారు యువత హృదయాల్లో అలజడి సృష్టించింది. మతి పోగొట్టేలా ఉన్న కత్రినా కైఫ్ బికినీ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాని దున్నేస్తున్నాయి. సల్మాన్ ఖాన్ సరసన నటించిన భారత్ చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత కత్రినా కైఫ్ తన స్నేహితులతో కలసి మాల్దీవులకు వెకేషన్ కు వెళ్ళింది. కత్రినా కైఫ్ వీలు చిక్కినప్పుడల్లా బీచ్ లో ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. తాజాగా బికినిలో కనిపించడంతో కత్రినా కైఫ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.
సల్మాన్ ఖాన్ సరసన మరోసారి
కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్ జోడి గురించి అందరికి తెలిసిందే. గతంలో వీరిద్దరూ ప్రేమలో మునిగితేలారనే వార్తలు ఉన్నాయి. ప్రేమలో విడిపోయినా వృత్తి పరంగా మాత్రం కలసి నటిస్తున్నారు. టైగర్ జిందా హై చిత్రం తర్వాత కత్రినా, సల్మాన్ కలసి నటిస్తున్న చిత్రం భారత్. ఇటీవలే ఈ చిత్రంలో కత్రినా కైఫ్ పాత్రకు సంబందించిన షూటింగ్ పూర్తయింది. దీనితో కత్రినా సమ్మర్ వెకేషన కోసం మాల్దీవులకు వెళ్ళింది.
బికినిలో అదుర్స్
రెండ్ అండ్ బ్లూ కాంబినేషన్ లో బికినీ ధరించిన కత్రినా కైఫ్ బీచ్ లో అందాలు ఆరబోస్తోంది. నెటిజన్లు కత్రినా అందాలకు ఫిదా అవుతున్నారు. కత్రినా కైఫ్ అందం వంకర్లు పెట్టలేని విధంగా ఉంటుందని అంటున్నారు. కత్రినా కైఫ్ బికినీ ఫోటోలని ఇంస్టాగ్రామ్లో షేర్ చేయగా లక్షల్లో లైకులు వస్తున్నాయి. కత్రినా బికినీ ఫోటోలని షేర్ చేసిన నాలుగైదు గంటల్లోనే ఒక్కో ఫొటోకు 8 లక్షలకు పైగా లైకులు వస్తున్నాయి.
రెండు డిజాస్టర్లు
కత్రినా కైఫ్ గత ఏడాది నటించిన భారీ చిత్రాలు థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, జీరో రెండూ డిజాస్టర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రం 2018లో అతిపెద్ద పరాజయంగా నిలిచింది. దీనితో కత్రినా ఆశలు ప్రస్తుతం సల్మాన్ ఖాన్ భారత్ చిత్రంపై ఉన్నాయి. అలీ జాఫర్ అబ్బాస్ ఈ చిత్రానికి దర్శకుడు. సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో వివిధ గెటప్స్ లో దర్శనమివ్వబోతున్నాడు.
అక్షయ్ కుమార్ సరసన
కత్రినా కైఫ్ నటిస్తున్న మరో చిత్రం సూర్యవంశీ. ఈ చిత్రం 2020లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కమర్షియల్ చిత్రాలతో ఘనవిజయాలు సొంతం చేసుకునే రోహిత్ శెట్టి ఈ చిత్రానికి దర్శకుడు. రోహిత్ శెట్టి చివరగా టెంపర్ రీమేక్ సింబా చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని అందుకున్నాడు.