Don't Miss!
- Sports CSK vs LSG: కొంపముంచిన ముస్తాఫిజుర్.. లక్నోను గెలిపించిన స్టోయినిస్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ప్రభాస్ మూవీలో దక్షిణాది స్టార్ హీరోయిన్: ఆమె యూటర్న్ తీసుకున్న ‘ఆదిపురుష్’ టీమ్
నాలుగైదేళ్లుగా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోన్న సినీ ప్రముఖుల్లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన 'బాహుబలి' సిరీస్ వల్ల అతడు యూనివర్శల్ స్టార్గా ఎదిగిపోవడమే దీనికి కారణం. ఈ చిత్రం తర్వాత అతడు వరుసగా పాన్ ఇండియా రేంజ్ ప్రాజెక్టులనే చేస్తున్నాడు. ఇప్పటికే 'సాహో'తో హిందీ చిత్ర పరిశ్రమలో మార్కెట్ను ఏర్పరచుకున్న అతడు.. నేరుగా ఓ బాలీవుడ్ మూవీని సైతం చేస్తున్నాడు. అదే.. 'ఆదిపురుష్'. తాజాగా ఈ మూవీ గురించి ఓ అప్డేట్ బయటకు వచ్చింది.
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న చిత్రమే 'ఆదిపురుష్'. రామయాణంలో ఎవరూ టచ్ చేయని ఓ పాయింట్తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగానూ.. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. అలాగే, ఇందులో సీతగా నటించే హీరోయిన్ విషయంలో ఎన్నో వార్తలు వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ టాల్ బ్యూటీ కృతీ సనన్ను ఈ పాత్రకు ఫైనల్ చేశారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. అది కూడా దక్షిణాదికి చెందిన కీర్తి సురేష్ పేరు.
అవును.. 'ఆదిపురుష్'లో సీతగా మహానటి ఫేం కీర్తి సురేష్ను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. కృతి సనన్ కంటే ఆమె అయితేనే ఈ పాత్రకు ఎక్కువ న్యాయం చేయగలుగుతుందని దర్శకుడు ఓం రౌత్ అనుకుంటున్నట్లు తాజాగా ఓ న్యూస్ బీ టౌన్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉండగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది.