Don't Miss!
- Sports RCB vs KKR: విరాట్ కోహ్లీ ట్రేడ్ మార్క్ సిక్సర్.. బిత్తరపోయిన మిచెల్ స్టార్క్! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
పంజా దర్శకుడితో కియారా అద్వానీ బిగ్ బడ్జెట్ మూవీ.. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్!
స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంటున్న కియారా అద్వానీ ఎలాంటి సినిమా చేసినా అమ్మడికి ఎదో ఒక విధంగా హెల్ప్ అవుతోంది. బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్స్ గ్యాప్ ఇచ్చినప్పటికీ అమ్మడు మాత్రం అస్సలు గ్యాప్ ఇవ్వడం లేదు. కరోనా ఉన్నా కూడా జనాలను ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక ఓటీటీ కంటెంట్ ద్వారా కూడా ప్రయోగాలు చేస్తూ తన టాలెంట్ ను బయటపెడుతోంది.
ఇక త్వరలోనే ఆమె నటించిన బిగ్ బడ్జెట్ మూవీ షెర్షా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల కానున్నట్లు సమాచారం. పంజా దర్శకుడు విష్ణు వర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో సిద్ధార్త్ మల్హోత్రా హీరోగా నటించాడు. ఈ సినిమా వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఇక ఇప్పట్లో సినిమా థియేటర్లు అనుకున్నట్లుగా నడిచే అవకాశం లేదని డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయాలని అనుకుంటున్నారు.
అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక సినిమా ద్వారా కియారా అద్వానీ ఎలాగైనా మరో సక్సెస్ అందుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే కాకుండా అమ్మడు తెలుగులో కూడా ఆఫర్స్ అందుకోవడానికి ట్రై చేస్తోంది. ఇప్పటికే భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలో నటించింది. ఇక ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాలో కూడా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే మరో ఇద్దరు అగ్ర హీరోలతో కూడా జత కట్టనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.