Don't Miss!
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- News ఓటు వెయ్యకపోయినా పర్వాలేదు, నా అంత్యక్రియలకు రండి, ప్రధాని అభ్యర్థి, మోదీని టార్గెట్ చేసి !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Kiara Advani: మీ అమ్మ నిన్ను ఇంకా వర్జిన్ అనే అనుకుంటుందా? బెడ్రూమ్లో ఆటలు ఆడలేదా?
కరణ్ జోహార్.. హిందీ చిత్రసీమలో ప్రముఖ దర్శక దిగ్దజం. అంతేకాకుండా సక్సెస్ఫుల్ నిర్మాత కూడా. ఇతను తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఈయన హోస్ట్గా వ్యవహరిస్తూ విజయవంతంగా దూసుకుపోతున్న టాక్ షో కాఫీ విత్ కరణ్. ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న కాఫీ విత్ కరణ్ షో ప్రస్తుతం ఏడో సీజన్ కొనసాగుతోంది.
ఈ షోలో పాల్గొన్న సెలబ్రిటీలను రోస్ట్ చేస్తూ వారి నుంచి ఎంతో ఆసక్తికర, షాకింగ్ విషయాలను బయటపెడుతుంటాడు. ఇప్పటికే ఈ షోలో పాల్గొన్న జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ ఇద్దరు అన్నదమ్ములను డేటింగ్ చేసిన విషయాన్ని రాబట్టాడు. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీని పలు కామెంట్స్తో ఇబ్బందిపెట్టాడు ఈ నిర్మాత.
కాఫీ విత్ కరణ్ షో.. సెలబ్రిటీల పర్సనల్ విషయాలను లాగడమో లేదా బయటపెట్టడమే లక్ష్యంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఏ సెలబ్రిటీ వచ్చినా సరే వారి బెడ్రూమ్ ముచట్లు, రిలేషన్షిప్ వ్యవహారాలు, లైంగిక జీవితం వంటి వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ప్రశ్నలే వేస్తుంటాడు కరణ్.
2005లో ప్రారంభం..
2005లో టెలివిజన్ ద్వారా ప్రారంభమైన కాఫీ విత్ కరణ్ షో ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ షోలో ఇప్పటికే జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్, సమంత, అక్షయ్ కుమార్, విజయ్ దేవరకొండ, అనన్య పాండే, కరీనా కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా తదితరులు పాల్గొన్నారు.
హీటైన ప్రశ్నలు..
తాజాగా ఈ షోలో కబీర్ సింగ్ జోడి కియారా అద్వానీ, షాహిద్ కపూర్ సందడి చేసింది. వీరిని సోఫాలో కూర్చొబెట్టి మరి తన హీటైన క్వశ్చన్స్తో కియారాకు చెమటలు తెప్పించాడు. 'నువ్ బెడ్రూమ్లో దొంగా పోలీసు వంటి ఆటలు ఆడలేదా?' అని కియారాను అడిగాడు కరణ్.
మా అమ్మ చూస్తుంది..
ఈ ప్రశ్నతో షాక్కు గురైన కియారా అద్వానీ కొంత ఇబ్బందిగా చూస్తూ 'మా అమ్మ ఈ ఎపిసోడ్ చూస్తుంది' అని సమాధానమిచ్చింది. అయినా వెనక్కు తగ్గని కరణ్ జోహార్.. 'అయితే ఏంటీ? మీ అమ్మ నువ్ ఇంకా వర్జన్వనే అనుకుంటుందా.. ఎంటీ?' అని మొహమాటం లేకుండా అడిగేశాడు.
తెలివిగా దాటేసినా కియారా..
దీంతో 'నాకు తెలిసినంతవరకు అవుననే అనుకుంటున్నా' అని బదులిచ్చింది కియారా అద్వానీ. తర్వాత 'నువ్ సిద్ధార్థ్తో రిలేషన్లో లేవా?' అని అడగ్గా.. 'అవుననీ చెప్పను, అలా అని కాదనీ చెప్పలేను' అని తెలివిగా ప్రశ్నను దాటవేసింది.
చూడముచ్చటైన జంట..
అనంతరం 'మరి మీరు క్లోజ్ ఫ్రెండ్సా?' అని కరణ్ ప్రశ్నించగా, 'క్లోజ్ ఫ్రెండ్స్ కంటే కూడా ఎక్కువ' అని తెలిపింది కియారా అద్వానీ. ఈ సమాధానం తర్వాత 'వీళ్లిద్దరిదీ చూడముచ్చటైన జంట. ఏ సమయంలో ఏ న్యూస్ వింటామో తెలియదు' అని షాహిద్ కపూర్ అంటాడు.
షేర్షా మూవీ నుంచి..
ప్రస్తుతం సత్య ప్రేమ్ కీ కథ అనే సినిమాలో నటిస్తోంది కియారా అద్వానీ. ఈ మూవీలో కార్తీక్ ఆర్యన్ హీరోగా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ జరగనుంది. కాగా కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా కలిసి షేర్షా నటించినప్పటి నుంచి వారి మధ్య ప్రేమాయణం నడుస్తోందని పుకార్లు వస్తున్నాయి.