ఆ మూవీలో నటించడం లేదని తేల్చి చెప్పిన కియారా!
బాలీవుడ్ నటి కియారా అద్వానీ త్వరలో ఇంతియాజ్ అలీ తెరకెక్కించబోయే 'లవ్ ఆజ్ కల్' సీక్వెల్లో నటించబోతున్నట్లు మీడియా ఛానల్స్, పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఆమె ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు.
'ఒక లీడింగ్ న్యూస్ పేపర్ వారు నేను ఇంతియాజ్ అలీ సర్ తీయబోయే తర్వాతి సినిమాలో చేస్తున్నట్లు రాశారు. ఆ వార్త నిజమైతే సంతోషమే. కానీ అది నిజం కాదు. నన్ను ఎవరూ ఆ ప్రాజెక్ట్ గురించి సంప్రదించలేదు' అని ట్వీట్ చేశారు.
కియారా అద్వానీ పేరు మాత్రమే కాదు... సారా అలీ ఖాన్ పేరు సైతం 'లవ్ ఆజ్ కల్ 2' విషయంలో ప్రచారంలో ఉంది. అయితే ఈ విషయంలో ఇంతియా అలీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అంతా ఫైనల్ అయిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడించారు.

కాగా... ప్రస్తుతం కియారా తన తాజా తెలుగు చిత్రం 'వినయ విధేయ రామ' ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్ వచ్చారు. రామ్ చరణ్ మూవీకి సంబంధించిన విశేషాలు పంచుకంటూ బిజీగా గడుపుతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించి ఈ మూవీ జనవరి 11న విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











