Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సుశాంత్ గురించి ఫిబ్రవరిలోనే ఫిర్యాదు.. సంచలన నిజాలు బయట పెట్టిన కేకే సింగ్
సుశాంత్ సింగ్ కేసులో ఎన్నో ట్విస్ట్లు, ఇంకెన్నో మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఇంత వరకు సుశాంత్ బాలీవుడ్ నెపోటిజం, మూవీ మాఫియా వల్ల డిప్రెషన్కు గురయ్యాడని అంతా అనుకున్నారు. సుశాంత్ తండ్రి కేకే సింగ్ రియా చక్రవర్తిపై చేసిన ఆరోపణలతో అంతా తారుమారైంది. తాజాగా కేకే సింగ్ బాంద్రా పోలీసుల తీరు గురించి చెప్పిన సంగతులు అందర్నీ షాక్కు గురి చేస్తున్నాయి. ఇంతకీ కేకే సింగ్ చెప్పిన విషయాలేంటో ఓసారి చూద్దాం.
ముంబై పోలీసుల విచారణ..
జూన్ 14న సుశాంత్ మరణించిన తరువాతి క్షణం నుంచి ముంబై పోలీసులు ఆత్మహత్యగానే కేసును పరిశీలించసాగారు. ఈ మేరకు బాలీవుడ్ నుంచి కొందరి స్టేట్మెంట్లను తీసుకున్నారు. ఇక సోషల్ మీడియాలో వచ్చిన ఒత్తిడి మేరకు సినీ పెద్దలను కూడా విచారించారు. అయితే కేసులో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించలేదు.
ఎంట్రీ ఇచ్చిన కేకే సింగ్..
తన కుమారుడి మరణం సంభవించి దాదాపు 40 రోజులు అయినా కేసు ముందుకు జరగకపోవడంతో సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫైర్ అయ్యారు. రియా చక్రవర్తిపై పాట్నాలో కేసు నమోదు చేశారు. డబ్బులు కాజేసింది, డిప్రెషన్కు, చావుకు కారణమైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాట్నా పోలీసుల జోక్యంతో కేసు ముమ్మరంగా ముందుకు సాగింది.
తప్పించుకునేందుకు రియా పాట్లు..
ఇక సుశాంత్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రియాను విచారించేందుకు పాట్నా పోలీసులు చర్యలు చేపట్టారు. అయితే రియా మాత్రం వీరి నుంచి తప్పించుకుంటూ తిరుగుతోంది. ముందస్తు బెయిల్ తీసుకోవడానికి ఖరీదైన లాయర్ను కూడా నియమించుకుంది. ఈ కేసును పాట్నా నుంచి ముంబైకి మార్చమని కూడా వేడుకుంది.
గతంలోనే ఫిర్యాదు..
సుశాంత్ పరిస్థితి పట్ల, హాని జరగనుందనే అనుమానంతో ఫిబ్రవరిలోనే బాంద్రా పోలీసులకు కేకే సింగ్ ఫిర్యాదు చేశారట. ఈ మేరకు తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలు తెలిపాడు. ఫిబ్రవరి 25నే సుశాంత్కు డేంజర్ ఉందని ఫిర్యాదు చేసినట్టు, అందులో కొందరి పేర్లను కూడా వ్యక్తపరిచానని, అయితే సుశాంత్ మరణం తరువాత కూడా వారు దాన్ని పట్టించుకోలేదని వాపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.