Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
Adipurush: హీరోయిన్ గురించి శుభవార్త చెప్పిన టీమ్.. నమ్మలేకపోతున్నానంటూ డైరెక్టర్ ట్వీట్
కొంత కాలంగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ జోష్తో కనిపిస్తున్నాడు పాన్ ఇండియా హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. కెరీర్ ఆరంభం నుంచి తెలుగు చిత్రాలకు మాత్రమే పరిమితం అయిన అతడు.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' తర్వాత మాత్రం తన పంథాను మార్చుకున్నాడు. ఇందులో భాగంగానే వరుసగా భారీ ప్రాజెక్టులనే చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ యూనివర్శల్ స్టార్ చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఒక్కొక్క మూవీని పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇక, ప్రభాస్ ఇప్పుడు నటిస్తోన్న చిత్రాల్లో పౌరాణిక జోనర్లో వస్తున్న 'ఆదిపురుష్' ఒకటి.
Bigg Boss: ఆరో వారం సంచలన ఎలిమినేషన్.. డేంజర్ జోన్లో టాప్ కంటెస్టెంట్లు.. ఆ నలుగురిలో ఒకరు ఔట్
చారిత్రక చిత్రాల దర్శకుడిగా పేరొందిన ఓం రౌత్ డైరెక్షన్లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రమే 'ఆదిపురుష్'. ఈ మూవీ ద్వారా మన స్టార్ హీరో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రామాయణంలో ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్తో ఈ మూవీ తెరకెక్కుతోంది. చెడు మీద మంచి ఎలా గెలిచింది అన్న కాన్సెప్టును ఇందులో చూపించబోతున్నారు. వీఎఫ్ఎక్స్ వండర్గా వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అయితే, మధ్యలో కొన్ని ఆటంకాలు ఏర్పడడంతో ఆలస్యం అయింది. ఇప్పుడు ముంబైలో చివరి షెడ్యూల్ను శరవేగంగా జరుపుతున్నారు.
క్రేజీ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ శ్రీరాముడిగానూ.. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తోన్న విషయం తెలిసిందే. అలాగే, ఇందులో జానకీ అలియాస్ సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ సొట్టబుగ్గల సుందరి కృతి సనన్ నటిస్తోంది. ఇందులో ఆమె పాత్ర ఎంతో హైలైట్గా ఉంటుందని చిత్ర యూనిట్ ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. పూర్తి స్థాయిలో భావోద్వేగాలతో కూడిన ఈ పాత్ర కోసం గతంలో ఎంతో మంది హీరోయిన్ల పేర్లను పరిశీలించారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం కృతిని ఫైనల్ చేసుకున్నారు.
జబర్ధస్త్ సెట్లో బాలకృష్ణకు రోజా ఫోన్: ఊహించని మాటలతో షాకిచ్చిన నటసింహం.. సంచలనంగా ఆడియో క్లిప్
చాలా రోజుల క్రితమే కృతి సనన్ 'ఆదిపురుష్' మూవీ షూటింగ్లో భాగం అయింది. అప్పటి నుంచి పలు షెడ్యూళ్లలో పాల్గొంటూ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె తన పాత్రకు సంబంధించిన షూటింగ్ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపింది. ఈ మేరకు దర్శకుడు ఓం రౌత్ 'డియర్ కృతి.. మీరు జానకి పాత్రను చేస్తున్నప్పుడు మ్యాజికల్గా అనిపించింది. ఈ షూటింగ్ అప్పుడే అయిపోయిందంటే నమ్మలేకపోతున్నా. మీతో ప్రయాణం అద్భుతంగా ఉంది' అని చెబుతూ.. ఆమె కేక్ కట్ చేస్తున్న ఫొటోను ట్వీట్ చేశాడు.
భారీ బడ్జెట్తో వీఎఫ్ఎక్స్ వండర్గా రూపొందుతోన్న 'ఆదిపురుష్' మూవీ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను పోషిస్తున్నాడు. వీళ్లతో పాటు ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాను 2022 ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారని ఇటీవలే ఓ న్యూస్ బయటకు వచ్చింది.