Don't Miss!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
లతా మంగేష్కర్పై వస్తోన్న వార్తలను ఖండించిన బంధువులు
కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న భారత రత్న , గాన కోకిల లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఆరోగ్యం విషమించిందన్న వార్తలతో పాటు కొంత మంది ఆకతాయిలు ఆమె మృతి చెందినట్టుగా ప్రచారం చేస్తున్నారు ఈ వార్తలపై ఎంతో మంది ప్రముఖులు స్పందించి విన్నవించినా రూమర్స్ మాత్రం ఆగడం లేదు.
రీసెంట్గా గాన గంధర్వుడు ఎస్పీబీ ఈ రూమర్లను ఖండిస్తూ.. 'నేను వ్యక్తిగతంగా తెలుసుకున్నాను. లతాజీ ఆరోగ్యం నిన్నటి కన్నా ఈ రోజు ఎంతో మెరుగ్గా ఉంది. ఆమె త్వరగా కోలుకుంటున్నారు. ఆమె బాగుండాలని కోట్లాది మంది అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. అందరికీ నా రిక్వెస్ట్.. సరైన సమాచారం లేకుండా కేవలం ఎవరో షేర్ చేశారని తప్పుడు వార్తలను మీరు కూడా షేర్ చేయకండి' అంటూ వీడియో మెసేజ్ను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా లతా మంగేష్కర్ మేనకోడలు రచన కూడా స్పందించారు. ఆమె కోలుకుంటోందని, బాగానే ఉందని, రూమర్లను నమ్మకండని చెప్పుకొచ్చింది. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా ట్వీట్ చేస్తూ.. అమెరికా నుంచి వైద్యులు వచ్చి ప్రత్యేకంగా పరీక్షించారని, ఆమె కోలుకుంటోందని డాక్టర్లు చెప్పినట్టు పేర్కొన్నాడు. దీంతో రూమర్లకు చెక్ పెట్టేసినట్టైంది. లతా మంగేష్కర్ ప్రస్తుతం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె శ్వాసతీసుకోవటంలో ఇబ్బందులు ఎదురవ్వటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.